News September 26, 2024
తిరుమలకు జీడిపప్పు వాహనాన్ని ప్రారంభించిన మంత్రి

పవిత్ర టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీ కోసం గురువారం నుంచి నాణ్యమైన జీడిపప్పు పలాస నుంచి వెళ్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు ఎంపీ, ఎమ్మెల్యేలతో వాహనానికి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత శ్రీకాకుళం జిల్లా నుంచి జీడిపప్పు పంపిణీ చేస్తున్నామన్నారు.
Similar News
News October 16, 2025
స్వచ్ఛంద్ర మరింత భాద్యతతో నిర్వర్తించాలి: కలెక్టర్

స్వచ్ఛంద్ర స్వచ్ఛభారత్ కార్యక్రమం మరింత బాధ్యతగా నెరవేర్చాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛభారత్ అవార్డు పొందిన నేలబొంతు గిరిజన బాలికల ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి విజయభారతికి అవార్డు లభించడం పట్ల ఆయన అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందజేసిన సర్టిఫికెట్ను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శ్రీకాకుళంలో బుధవారం అందజేశారు.
News October 15, 2025
‘విశాఖ ఎకనామిక్ జోన్’ కేంద్ర బిందువుగా భోగాపురం

‘విశాఖ ఎకనామిక్ జోన్’ కేంద్ర బిందువుగా భోగాపురం మారనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం గుర్తించబోయే 20 వేల ఎకరాల భూమిలో, భోగాపురం ఎయిర్పోర్ట్కు 30-40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి, గాజువాక మండలాలతో పాటు భోగాపురం పరిసర ప్రాంతాల్లో భూమి గుర్తింపు ప్రక్రియ వేగవంతమవుతోంది.
News October 15, 2025
కలెక్టరేట్ నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణ పనులు డిసెంబరు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన కలెక్టరేట్ను పరిశీలించారు. ప్రజల పరిపాలనకు ఉపయోగపడే గదులన్నీ కింద ఫ్లోర్లో ఉండేలా, ఒక్కో శాఖకు కేటాయించే స్క్వేర్ ఫీట్ను నిర్ణయించి, గదులను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.