News March 15, 2025

తిరుమలలో ఘోర అపచారం: రోజా

image

ప్రభుత్వంపై రోజా సంచలన ట్వీట్ చేశారు. ‘పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఘోర అపచారం. ఓ మందుబాబు కొండపైన వీరంగం సృష్టించాడు. ఎవరికి ఎంత మందు కావాలంటే అంత అమ్ముతాడంట. కూటమి ప్రభుత్వంలో తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఈ వీడియోనే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో బెల్టు షాపుల ద్వారా మద్యాన్ని ఏరులైపారిస్తున్నారు. ఇప్పుడది తిరుమలకు కూడా చేరింది. దేవుడా.!’ అంటూ రోజా ట్వీట్ చేశారు.

Similar News

News March 16, 2025

CM రేవంత్ దీనికి సమాధానం చెప్పాలి: KTR

image

TG: OUలో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని KTR అన్నారు. నిరసన తెలిపే హక్కును కాపాడతామని ఇచ్చిన హామీ ఏమైందో CM సమాధానం చెప్పాలన్నారు. ‘ఇది ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోంది. నిరంకుశ వైఖరిని మార్చుకోకపోతే గుణపాఠం తప్పదు. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న CM, 6 గ్యారంటీలతో పాటు దీనిని అటకెక్కించారు’ అని ట్వీట్ చేశారు.

News March 16, 2025

మండపేట: మాజీ మున్సిపల్ ఛైర్మన్ తల్లి మృతి

image

మండపేట మాజీ మున్సిపల్ ఛైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ మాతృమూర్తి చుండ్రు అనంతలక్ష్మి (70) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. నెల రోజులు క్రితం గుండె సంబంధిత సమస్యలు తలెత్తగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. కాగా ఆదివారం తెల్లవారుజామున 3 గంటలు సమయంలో ఆమె గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన వైద్యులను పిలిపించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News March 16, 2025

టీమ్‌ను మార్చినా ఓటమి తప్పలేదు

image

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కెప్టెన్‌ రిజ్వాన్, బాబర్ ఆజమ్‌తో సహా పలువురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించిన పాకిస్థాన్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు. NZతో తొలి టీ20లో ఆ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. యువ ఆటగాళ్లు విఫలమవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 91కి ఆలౌటైంది. న్యూజిలాండ్ 10.1 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టపోయి టార్గెట్‌ను ఛేదించింది. NZ గడ్డపై పాక్‌కు ఇదే అత్యల్ప టీ20 స్కోర్.

error: Content is protected !!