News March 15, 2025
తిరుమలలో ఘోర అపచారం: రోజా

ప్రభుత్వంపై రోజా సంచలన ట్వీట్ చేశారు. ‘పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఘోర అపచారం. ఓ మందుబాబు కొండపైన వీరంగం సృష్టించాడు. ఎవరికి ఎంత మందు కావాలంటే అంత అమ్ముతాడంట. కూటమి ప్రభుత్వంలో తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఈ వీడియోనే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో బెల్టు షాపుల ద్వారా మద్యాన్ని ఏరులైపారిస్తున్నారు. ఇప్పుడది తిరుమలకు కూడా చేరింది. దేవుడా.!’ అంటూ రోజా ట్వీట్ చేశారు.
Similar News
News November 10, 2025
వరంగల్ ఆర్టీఏలో వాట్సాప్లోనే ఫిక్సింగ్..!

వరంగల్ ఆర్టీఏలో ఏ వాహనానికి ఎంత మామూలు ఇవ్వాలో వాట్సాప్లోనే ఏజెంట్లకు,అధికారుల బినామీల మధ్య సంభాషణలు జరుగుతున్నాయి. నేరుగా పని కోసం వెళ్లే వాహనదారులకు మాత్రం తమ దరఖాస్తు మీద ఎర్ర టిక్ లేకపోతే సాకులు చెప్పి తిప్పడం, చివరకు దరఖాస్తుదారుడు ఏజెంట్ల దగ్గరికి వెళ్లేలా చేయడంలో కౌంటర్ సిబ్బంది ఆరితేరి పోయారు. ఏసీబీదాడులు నామమాత్రంగానే ఉంటున్నాయని, వాహనదారులు చెబుతుండటం అక్కడ జరుగుతున్న అవినీతికి నిదర్శనం.
News November 10, 2025
పచ్చిపాలతో ముఖానికి మెరుపు

పాలతో ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..* 2చెంచాల పచ్చిపాలు, చెంచా తేనె కలిపి ఆ పేస్ట్ను కాటన్ బాల్స్తో ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. * కొద్దిగా పచ్చిపాలు, సగం అరటి పండు వేసి మెత్తగా కలపాలి. ఆ పేస్ట్ను ముఖంపై అప్లై చేసి 20నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం మెరుపులీనుతుంది.
News November 10, 2025
తిరుమల: వైవీ సుబ్బారెడ్డికి సిట్ విచారణ తప్పదా..?

తిరుమల కల్తీ నెయ్యి విచారణలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సీబీఐ సిట్ విచారణకి పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరిని అరెస్టు చేయగా విచారణకు వైవీ వస్తే మరింత మంది అధికారులు, బయట వ్యక్తుల పాత్ర బయటపడే పరిస్థితి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. హైకోర్టు ఆదేశాలతో వైవీ విచారణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


