News March 15, 2025
తిరుమలలో ఘోర అపచారం: రోజా

ప్రభుత్వంపై రోజా సంచలన ట్వీట్ చేశారు. ‘పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఘోర అపచారం. ఓ మందుబాబు కొండపైన వీరంగం సృష్టించాడు. ఎవరికి ఎంత మందు కావాలంటే అంత అమ్ముతాడంట. కూటమి ప్రభుత్వంలో తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఈ వీడియోనే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో బెల్టు షాపుల ద్వారా మద్యాన్ని ఏరులైపారిస్తున్నారు. ఇప్పుడది తిరుమలకు కూడా చేరింది. దేవుడా.!’ అంటూ రోజా ట్వీట్ చేశారు.
Similar News
News December 4, 2025
ఆకతాయి వేధింపులకు యువతి బలి

ఆకతాయి వేధింపులు యువతి ప్రాణాన్ని తీశాయి. చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన స్పందన (17) ధర్మవరంలో ఇంటర్ చదువుతోంది. కాలేజ్కు వెళ్తుండగా గతనెల 26న ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రశ్నించగా దాడికి పాల్పడ్డాడు. మనస్తాపానికి గురైన స్పందన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఇంట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు అనంతపురం తరలించారు. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది.
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<
News December 4, 2025
‘హిల్ట్’ లీకేజ్.. ఇద్దరు ఉన్నతాధికారులపై అనుమానం!

TG: <<18457165>>హిల్ట్<<>> పాలసీ లీకేజీపై విజిలెన్స్ టీమ్ విచారణ వేగవంతం చేసింది. ఈ లీక్ వెనుక ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారని అనుమానిస్తోంది. సీఎంఓలోని ఓ అధికారిని నిన్న రాత్రి టీమ్ విచారించినట్లు తెలుస్తోంది. అటు BRSతో పాటు ఓ కీలక బీజేపీ నేతకు కూడా సమాచారం లీక్ అయినట్లు టాక్. ఉన్నతాధికారుల ప్రమేయంపై క్లారిటీ రావాల్సి ఉంది. CM ఈ విషయమై సీరియస్గా ఉండటంతో క్లారిటీ వస్తే కారకులకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశముంది.


