News February 7, 2025
తిరుమలలో దంపతుల ఆత్మహత్య

తిరుమలలో విషాద ఘటన జరిగింది. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన శ్రీనివాసులు నాయుడు(60), అరుణ(55) దంపతులు తిరుమల నందకం గెస్ట్ హౌస్లో గురువారం రూము తీసుకున్నారు. నిన్నటి నుంచి బయటకు రాకపోవడంతో టీటీడీ సిబ్బంది పోలీసులకు ఇవాళ సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డోర్లు తెరిచారు. దంపతులు ఇద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 19, 2025
అరకు: హైడ్రో పవర్ నిర్మాణం చేపడితే బాణాలతో తరిమికొడతాం

అల్లూరి జిల్లా మన్యంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్కు కేబినెట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అరకులోయ(M) బస్కిపంచాయతీలోని కంజరితోటలో గిరిజనులు డిమాండ్ చేశారు. బస్కి, కురిడీలోఈ ప్రాజెక్టు ఏర్పాటును విరమించుకోకపోతే బాణాలతో తరిమికొడతామన్నారు. నేడు అరకులోయలో ఉదయం 10 గంటల నుంచి జరగనున్న ర్యాలీలో ఆదివాసీలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
News September 19, 2025
‘కల్కి-2’ నుంచి దీపిక ఔట్.. కారణాలివేనా?

‘కల్కి-2’ నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణెను <<17748690>>తీసేయడంపై<<>> నెట్టింట చర్చ జరుగుతోంది. ఆమె డిమాండ్స్ వల్లే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన టీమ్ మొత్తాన్ని (25 మంది) లగ్జరీ హోటల్లో ఉంచాలనడంతో పాటు 25% రెమ్యునరేషన్ పెంచాలని, రోజుకు 5-7గంటలే పనిచేస్తానని డిమాండ్ చేశారట. ఆమె రెమ్యునరేషన్ హైక్కు ఓకే చెప్పినా, షూటింగ్ టైమ్ తగ్గించడానికి మాత్రం మేకర్స్ ఒప్పుకోలేదని సినీవర్గాలు పేర్కొన్నాయి.
News September 19, 2025
ఏలూరు: నంబర్ ప్లేట్లపై ఇలా రాస్తే..ఇక వాహనం సీజ్

మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుంటే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ హెచ్చరించారు. నంబర్ ప్లేట్లపై వారి తాలూకా అనిరాసినా, నిబంధనలకు లోబడి లేకున్నా వాహనాలను సీజ్ చేస్తామన్నారు. వీటి తయారీదారులపై చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు. నంబర్ ప్లేట్లపై నేటి నుంచి స్పెషల్ డ్రైవ్లు చేపట్టాలని ఆయన గురువారం ఆదేశించారు.