News February 7, 2025
తిరుమలలో దంపతుల ఆత్మహత్య

తిరుమలలో విషాద ఘటన జరిగింది. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన శ్రీనివాసులు నాయుడు(60), అరుణ(55) దంపతులు తిరుమల నందకం గెస్ట్ హౌస్లో గురువారం రూము తీసుకున్నారు. నిన్నటి నుంచి బయటకు రాకపోవడంతో టీటీడీ సిబ్బంది పోలీసులకు ఇవాళ సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డోర్లు తెరిచారు. దంపతులు ఇద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 14, 2026
ఫొటో తీయండి.. ₹1,000 ఫాస్టాగ్ రీఛార్జ్ కొట్టేయండి!

నేషనల్ హైవేలపై టాయిలెట్ల పరిశుభ్రతను పెంచేందుకు NHAI తెచ్చిన ‘Clean Toilet Picture Challenge’ గడువును 2026 జూన్ 30 వరకు పొడిగించారు. హైవేపై వెళ్లేటప్పుడు ఎక్కడైనా టాయిలెట్లు డర్టీగా ఉంటే ఆ ఫొటోను Rajmargyatra యాప్లో లొకేషన్ వివరాలతో అప్లోడ్ చేయాలి. కంప్లైంట్ నిజమని తేలితే 5రోజుల్లో మీ ఫాస్టాగ్ అకౌంట్కు ₹1,000 క్రెడిట్ అవుతాయి. ఈ ఆఫర్ కేవలం NHAI పరిధిలోని టాయిలెట్లకు మాత్రమే వర్తిస్తుంది.
News February 14, 2026
మధిరలో హ్యాట్రిక్ కౌన్సిలర్గా.. BRS తరఫున ఏకైక

మధిర మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత ఓటమి లేకుండా మూడోసారి హ్యాట్రిక్ కౌన్సిలర్గా యన్నంశెట్టి వెంకట అప్పారావు విజయం సాధించారు. తొలిసారి సీపీఎం, రెండోసారి బీఆర్ఎస్ నుంచి 8వ వార్డు నుంచి గెలిచిన ఆయన, ఈసారి 19వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మునుగోటి వెంకటేశ్వర్లుపై 192 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మధిరలో బీఆర్ఎస్ తరఫున ఏకైక కౌన్సిలర్గా నిలవడం విశేషం.
News February 14, 2026
తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

తూర్పు గోదావరి జిల్లాలో 6 కోర్టు అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, 7వ తరగతి అర్హత కలిగి, వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. కోర్టు అసిస్టెంట్కు నెలకు రూ.10వేలు, కోర్ట్ అటెండెంట్కు రూ.6వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://eastgodavari.dcourts.gov.in/


