News August 30, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు భారీగా పోటెత్తారు. కంపార్టుమెంట్లు అన్నీ నిండి… క్యూ లైన్ టీబీసీ వరకు వెళ్లింది. సర్వదర్శనం కోసం సుమారు 18గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. ఇక నిన్న స్వామివారిని 62, 569 మంది దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.15 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Similar News

News November 13, 2025

నెల్లూరు లేడీ డాన్ అరుణను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

image

నెల్లూరు లేడీ డాన్ అరుణను పోలీస్ కస్టడికి ఇచ్చేందుకు విజయవాడ కోర్ట్ బుధవారం అనుమతి ఇచ్చింది. వారంపాటు కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చెయ్యగా… కోర్టు రెండు రోజులు మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో నెల్లూరు జిల్లా జైలులో ఉన్న ఆమెను 13,14 తేదీల్లో విచారించేందుకు సూర్యారావు పేట పోలీసులు తీసుకెళ్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసినట్లు ఆమెపై కేసు నమోదు అయింది.

News November 13, 2025

నెల్లూరు ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 65 ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. చుట్టు పక్కల వారు గుర్తించి హాస్పిటల్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. దర్గామిట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుని వివరాలు తెలియకపోవడంతో దర్యాప్తు చేస్తున్నారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 9440700018, 08612328440 నంబర్లకు కాల్ చేయాలని పోలీసులు కోరారు.

News November 13, 2025

వారికి రూ.90 కోట్ల మంజూరు: అబ్దుల్ అజీజ్

image

నెల్లూరు: ఇమామ్, మౌజన్‌ల గౌరవ వేతనాల కోసం రూ.90 కోట్లు మంజూరు చేసినట్లు ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించిందన్నారు. చంద్రబాబు దూరదృష్టి, సమానత్వ నిబద్ధతతోనే ముస్లింల అభివృద్ధి జరుగుతుందన్నారు.