News April 1, 2025

తిరుమలలో వైఫల్యాలపై PMకి లేఖ

image

తిరుమలలో వరుస భద్రత వైఫల్యాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి, హోం మంత్రి, హోంశాఖ కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. వైకుంఠ ఏకాదశి రోజున ఆరుగురు భక్తులు తొక్కిసలాటలో చనిపోవడం, నాన్ వెజ్ పదార్థాలను కొండపైకి తీసుకెళ్లడం, మతిస్థిమితం లేని వ్యక్తి బైక్‌పై తిరుమల కొండపైకి వెళ్లిన ఘటనలను లేఖలో పేర్కొన్నారు.

Similar News

News November 19, 2025

గోదావరిఖని: 10 STATES.. 16 Days.. 4000 KMల సైక్లింగ్ రైడ్

image

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని FIT INDIAలో భాగంగా కశ్మీర్ TO కన్యాకుమారి వరకు A RIDE FOR UNITY పేరిట సైక్లింగ్ రైడ్ చేపట్టారు. 3000 మంది అప్లై చేసుకోగా 150 మందిని ఎంపిక చేశారు. సింగరేణి OCP 5 EP ఆపరేటర్ వెంకట తిరుపతి రెడ్డికి కూడా ఇందులో అవకాశం దొరికింది. 10 STATES.. 16 DAYS.. 4000 KMల సైక్లింగ్ రైడ్లో పాల్గొన్నారు. ఇది తనకు అద్భుత అనుభూతిని ఇచ్చిందని తిరుపతి రెడ్డి తెలిపారు.

News November 19, 2025

ఆక్వా రైతు సక్సెస్ స్టోరీ షేర్ చేసిన కలెక్టర్ కార్యాలయం..!

image

బాపట్ల (D)కొల్లూరు (M) రావికంపాడు గ్రామానికి చెందిన పి.పద్మరావు మత్స్య పెంపకంలో కొత్త మార్గాలను అన్వేషిస్తూ PMMSY పథకం సహాయంతో రూ.14లక్షలతో 5టన్నుల సామర్థ్యం గల బయోఫ్లాక్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ యూనిట్‌లో చేపల ఉత్పత్తి ఖర్చు కేజీకి రూ.200 కాగా, విక్రయ ధర కేజీకి రూ.275 రావడం ద్వారా ప్రతి కిలోపై రూ.75 లాభం పొందారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం సాధించారని కలెక్టర్ కార్యాలయం బుధవారం తెలిపింది.

News November 19, 2025

అంగరంగ వైభవంగా ప్రారంభమైన అనంతుని దీపోత్సవం

image

పద్మనాభంలోని అనంత పద్మనాభుని దీపోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. తొలి పావంచ వద్ద దీపాలను వెలిగించి విశేష అర్చనలు చేశారు. పోలీసులకు ఉత్సవం జరిగే అన్ని ప్రదేశాలలో డ్యూటీలు వేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, సిసి కెమెరాలను, డ్రోన్ కెమెరాను ఆ కేంద్రానికి అనుసంధానం చేశారు. రాత్రికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని ఆలయ వర్గాలు తెలిపాయి.