News January 31, 2025
తిరుమలలో సర్వభూపాల వాహనం ట్రయల్ రన్

శ్రీవారి రథసప్తమిలో వినియోగించే సర్వభూపాల వాహనం పటిష్ఠతను పరిశీలించేందుకు గురువారం టీటీడీ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారు విహరించే అన్ని వాహనాల్లోకి సర్వభూపాల వాహనం ఎక్కువ బరువుగా ఉంటుంది. ఈ వాహన సేవ సమయంలో వాహనబేరర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు పరిశీలించారు.
Similar News
News February 23, 2026
ఆదిలాబాద్లో తిరిగి ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు ఎంపీ గోడం నాగేష్ జోక్యంతో పునఃప్రారంభమయ్యాయి. కొనుగోళ్లు ఆగిపోవడంతో ఆందోళనలో ఉన్న రైతుల సమస్యను బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఎంపీ, అధికారులతో మాట్లాడి ప్రక్రియను పునరుద్ధరించారు. తమకు అండగా నిలిచిన నేతలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
News February 23, 2026
డయేరియా అదుపునకు అత్యవసర చికిత్స అందించాలి: రామ్మోహన్

శ్రీకాకుళంలో డయారేయా కేసుల ఉద్ధృతిపై జిల్లా అధికారులతో మాట్లాడిన కేంద్రమంత్రి రామ్మోహన్ సోమవారం అత్యవసరంగా సమీక్షించారు. రోగులకు అత్యవసర చికిత్స అందించి, వ్యాధి ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వ్యాధి సోకడానికి గల కారణాలు అన్వేషించాలని ఆయన సూచించారు. నగరపాలక సంస్థ ప్రజారోగ్య సిబ్బంది, అధికారులు క్షేత్ర స్థాయిలో నిరంతరo అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
News February 23, 2026
ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. ‘ప్రహార్’ పాలసీని ఆవిష్కరించిన కేంద్రం!

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు కౌంటర్ టెర్రరిజం పాలసీ ‘ప్రహార్’ను కేంద్రం ఆవిష్కరించింది. సరిహద్దుల్లోని జిహాదీ నెట్వర్క్లు, సైబర్ దాడులు, డ్రోన్ ఆధారిత స్మగ్లింగ్, క్రిప్టోకరెన్సీ, జీవ&అణు పదార్థాల దుర్వినియోగం, సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ పాలసీని రూపొందించింది. టెర్రర్ దాడులను ఆపేందుకు మల్టీ ఏజెన్సీలను వినియోగించనుంది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాయింట్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనుంది.


