News March 30, 2024

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. మహిళ మృతి

image

తిరుమల మొదటి ఘట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఏనుగులు అర్చ్ దాటిన తర్వాత ఓ కారు అదుపు తప్పి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి కారులో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళే క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పెద్దలు పిల్లలకు గాయాలు కాగా.. అశ్వినిని ఆసుపత్రికి తరలించారు. ఈవో ధర్మారెడ్డి గాయపడిన వారిని పరామర్శించారు.

Similar News

News October 19, 2025

ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం: చిత్తూరు SP

image

జిల్లాలో ప్రజాసేవ కోసం పోలీసు సిబ్బంది ఎలా వేళల అందుబాటులో ఉంటారని SP తుషార్ డూడీ ఆదివారం తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

News October 19, 2025

పూతలపట్టులో చోరీ

image

పూతలపట్టు మండలం ఈ కొత్తకోట పంచాయతీ చౌటపల్లి దళితవాడలో రంగయ్య కుమారుడు పాటూరు దాము ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 60 గ్రాములు బంగారు, వెండి కాళ్లపట్టీలు మూడు జతలు, రూ.50 వేలు నగదు చోరీ చేసి తీసుకెళ్లారు. ఈ మేరకు దాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి ఇంటిని తనిఖీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 19, 2025

‘కాంతార’లో మెప్పించిన SRపురం వాసి

image

పాన్ ఇండియా మూవీ ‘కాంతార’లో SRపురం(M) పొదలపల్లికి చెందిన ఏకాంబరం నటించారు. ఇందులో భాగంగా తన నటనకు దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి మొచ్చకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన్ను స్వగ్రామం గంగాధర నెల్లూరులో వైసీపీ నేత కృపాలక్ష్మి అభినందించారు. సినిమా రంగంలో మరింత ప్రతిభ చూపి గుర్తించ దగ్గ పాత్రలు పోషించాలని ఆమె ఆకాంక్షించారు.