News March 30, 2024
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. మహిళ మృతి

తిరుమల మొదటి ఘట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఏనుగులు అర్చ్ దాటిన తర్వాత ఓ కారు అదుపు తప్పి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి కారులో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళే క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పెద్దలు పిల్లలకు గాయాలు కాగా.. అశ్వినిని ఆసుపత్రికి తరలించారు. ఈవో ధర్మారెడ్డి గాయపడిన వారిని పరామర్శించారు.
Similar News
News February 12, 2026
చిత్తూరు జిల్లాలో మీకు ఈ విషయం తెలుసా?

కంగి, కంగడు అనే బందిపోటు దొంగలు 1066-1132 మధ్య కుప్పం ప్రాంతానికి అధిపతులుగా పాలించారు. దట్టమైన అరణ్యంలో ఎరుకలు, యానాది కులాలకు చెందిన బందిపోటు దొంగలు అక్కడక్కడ స్థావరాలను ఏర్పరచుకున్నారు. నాటి పాలకుల పేరును చిరస్థాయిగా నిలిపేలా ఈ ప్రాంతానికి కంగుంది దుర్గం అనే పేరు పెట్టారని స్థానికులు చెబుతున్నారు. తర్వాత జమీందారుల పాలన కొనసాగుతూ 1950 వరకు సుమారు 884 ఏళ్లు ఈ కోట రాజధానిగా ఉండేది.
News February 12, 2026
చిత్తూరు: పరీక్షల్లో అధికారుల ఫెయిల్.. 19మందిపై చర్యలు

రెవెన్యూ శాఖలో తాత్కాలిక షరతులతో సీనియర్ అసిస్టెంట్లుగా ఇటీవల ప్రమోషన్ వచ్చింది. శాఖాపరమైన పరీక్షల్లో పాస్ కాకపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 19 మందిని తిరిగి గ్రేడ్-1 వీఆర్వోలుగా రివర్షన్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. వీరు శాఖపరమైన పరీక్షల్లో అనుకున్న మేర ఫలితాలు సాధించకపోవడంతో రివర్షన్ ఇచ్చినట్టు అందులో పేర్కొన్నారు.
News February 11, 2026
చిత్తూరు: బీపీఎస్ పథకానికి స్పందన ఏది?

చిత్తూరు జిల్లాలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ పథకానికి తగినంతగా ఆదరణ లభించడం లేదు. ఇప్పటివరకు 300 లోపే దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులో చిత్తూరు నగరపాలక పరిధిలోనే 200 పైగా ఉన్నాయని తెలుస్తోంది. 2019లో జిల్లాలో ఇందుకోసం సుమారు 2000 దరఖాస్తులు వస్తే రూ.9 కోట్ల ఆదాయం చేకూరింది. ప్రస్తుతం మార్చిలో గడువు ముగియనుండడంతో అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది.


