News March 26, 2025

తిరుమల: టీటీడీ ట్రస్టులకు భారీగా పెరిగిన విరాళాలు

image

గడిచిన 9 రోజుల్లో వివిధ ట్రస్ట్‌లకు విరాళంగా రూ. 26.85 కోట్లు అందినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ‘X’ వేదికగా తెలిపారు. అత్యధికంగా శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్‌కు రూ.11.67 కోట్లు, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.6.14 కోట్లు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌కు రూ.4.88 కోట్లు అందినట్లు చెప్పారు. తాజాగా టీటీడీ విద్యాదాన ట్రస్ట్‌కు రూ 1.01 కోట్లు విరాళం అందినట్లు చెప్పారు.

Similar News

News December 25, 2025

వరస వివాదాల్లో శ్రీశైలం మల్లన్న క్షేత్రం!

image

శ్రీశైలం మల్లన్న క్షేత్రం వరస వివాదాలతో SMలో వైరల్ అవుతోంది. భద్రతా లోపాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. మొన్న నిబంధనలకు విరుద్ధంగా ఓ అధికారి వ్యవహారం, ఓ యువతి డాన్స్, నిన్న క్షేత్ర పరిధిలో పేకాట తదితర ఘటనలతో మల్లన్న క్షేత్రం పేరు తెరపైకొస్తుంది. మరోవైపు అర్హతలను మరచి ప్రమోషన్లు ఇవ్వడంపై విమర్శలొస్తున్నాయి. ఆ మల్లన్నే శ్రీశైలం క్షేత్రాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.

News December 25, 2025

రేపు బాక్సింగ్ డే.. సెలవు

image

రేపు (డిసెంబర్ 26) బాక్సింగ్ డే సందర్భంగా తెలంగాణలో పబ్లిక్ హాలిడే ప్రకటించారు. దీంతో అన్ని రకాల స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. అటు ఏపీలో రేపు ఆప్షనల్ హాలిడే ఉంది. కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక శనివారం, ఆదివారం కూడా సెలవులు కావడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు.

News December 25, 2025

FLASH: నార్కట్‌పల్లిలో యాక్సిడెంట్.. ఛిద్రమైన శరీరం..!

image

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. లూనాపై వెళుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని శరీర భాగాలను ఒక చోటికి చేర్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.