News April 13, 2025

తిరుమల: పాద రక్షల ఘటనపై టీటీడీ చర్యలు

image

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఇద్దరు తెల్లరంగు మెత్తటి గుడ్డతో తయారు చేసిన డిస్‌పోజబుల్ చెప్పులు ధరించి దర్శనానికి ప్రవేశించిన ఘటనపై టీటీడీ చర్యలు చేపట్టింది. విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలమైన సిబ్బందిని సస్పెండ్ చేసింది. టీటీడీ ఈవో శ్యామల రావు ఆదేశాల మేరకు ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న TTDసిబ్బంది, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేసింది.

Similar News

News April 11, 2026

రిస్కీ రీఎంట్రీ: 40,000kmph వేగం.. 2,760°C టెంపరేచర్

image

ఆర్టెమిస్-2 మిషన్‌లో రీఎంట్రీ అత్యంత రిస్కీ పార్ట్. 40,000kmph స్పీడ్‌తో భూవాతావరణంలోకి క్యాప్సూల్ దూసుకొచ్చింది. అప్పుడు పుట్టిన 2,760°C వేడికి ఓరియన్ క్యాప్సూల్ చుట్టూ ఎర్రటి ప్లాస్మా సెగలు కమ్మేశాయి. అప్పుడే 6 నిమిషాలు కమ్యూనికేషన్ కట్ అవ్వడంతో హ్యూస్టన్ కంట్రోల్ రూమ్‌లో టెన్షన్ పీక్స్‌కు చేరింది. హీట్ షీల్డ్ ప్రాణాలు కాపాడగా పారాచూట్లు విచ్చుకుని వ్యోమగాములు సేఫ్‌గా దిగడంతో రిలీఫ్ అయ్యారు.

News April 11, 2026

కాళేశ్వరం ప్రాజెక్ట్.. సీఎం టైం బాండ్ అతిపెద్ద సవాల్

image

మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో 2023 నుంచి సాంకేతిక లోపాలతో నీటి ఎత్తిపోతలు నిలిచిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులపై సమీక్షించిన సీఎం వానకాలంలోపు పూర్తిచేయాలని టైం బాండ్ పెట్టడంతో ఇరిగేషన్ శాఖ టెన్షన్ పడుతోంది. దెబ్బతిన్న బ్యారేజీలు, పంపు హౌస్‌లో సాంకేతిక సమస్యలు, క్లిష్టమైన ఇంజినీరింగ్ పనులు ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడుతోంది.

News April 11, 2026

నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు

image

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు ఉదయం 11 గంటలకు రానున్నారు. ముందుగా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొని, అనంతరం అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం కానున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ రాష్ట్ర కమిటీపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.