News June 18, 2024
తిరుమల : పుకార్లను నమ్మవద్దు.. టీటీడీ విజ్ఞప్తి

వయోవృద్ధుల దర్శనార్థం వారి టికెట్లకు సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది పూర్తిగా అబద్దమని, ఇటువంటి ఫేక్ న్యూస్ భక్తులు నమ్మొద్దని TTDవిజ్ఞప్తి చేసింది. ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం TTD ప్రతినెల 23న 3నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోందన్నారు. www.tirumala.org, https://ttdevastanams.ap.inను మాత్రమే సంప్రదించగలరన్నారు.
Similar News
News November 21, 2025
చిత్తూరు: పేదరికాన్ని జయించినా.. విధిని ఓడించలేక.!

అసలే పేదరికం.. మరోవైపు తల్లిలేని లోటు. అయినా ఆమె పట్టుదలతో ఉన్నత చదువులు చదివింది. ఓ వైపు నాన్నకు తోడుగా ఉంటూ, కుటుంబ బాధ్యతలు మోస్తూ <<18347620>>కష్టాల కడలి<<>>ని దాటి MLHP ఉద్యోగం సంపాదించింది ఆదిలక్ష్మి. పెళ్లి చేసుకుని ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ విధికి ఇది నచ్చలేదోమో. ఆమె బిడ్డ రూపంలో మరోసారి పరీక్షించింది. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకున్న ఆమె కూతురి విషయంలో కలత చెంది ఆత్మహత్య చేసుకుంది.
News November 21, 2025
చిత్తూరు: భారీగా పెరిగిన కూరగాయల ధరలు

జిల్లాలో భారీగా పెరిగిన కూరగాయల ధరలతో పేద, మధ్య తరగతి వర్గాలకు ఇబ్బందులు తప్పడం లేదు. వరుసగా కురుస్తున్న వర్షాలతో పంట దిగుబడులు తగ్గి ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. పచ్చిమిరప రూ.40 నుంచి రూ.60కి, బీర రూ.40-రూ.60, వంకాయలు రూ.90-రూ.120 వరకు చేరుకున్నాయి. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News November 21, 2025
బెంగళూరులో రూ.7కోట్ల దోపిడీ.. చిత్తూరులో కారు

బెంగళూరు జేపీ నగర్లో బుధవారం పట్టపగలే దోపిడీ చేసిన కొందరు ఏపీ వైపు వచ్చారు. అక్కడి HDFC బ్యాంకు ఏటీఎంలో నగదు జమ చేసే వాహనాన్ని కొంతమంది అడ్డుకున్నారు. రూ.7 కోట్ల నగదును నిందితులకు చెందిన ఇన్నోవా కారులోకి మార్చుకుని పారిపోయారు. చిత్తూరు(D) గుడిపాల మండలం చీలాపల్లి కూడలి పెట్రోల్ బంకు వద్ద కారు వదిలి పరారయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


