News September 22, 2024
తిరుమల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం

తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబును టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో జె. శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సీఎంకి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి, బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Similar News
News November 21, 2025
మేడికొండూరు: నిన్న కూతూరి పెళ్లి.. ఇవాళ గుండెపోటుతో తండ్రి మృతి

నిన్నటి పెళ్లి పందిరిలో సందడి ఇంకా ముగియక ముందే మేడికొండూరు మండలం డోకిపర్రులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 30 ఏళ్ల సుదీర్ఘ కాలంగా సీనియర్ పాత్రికేయుడిగా సేవలందిస్తున్న దావాల వెంకట రావు శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. నిన్ననే తన కూతురి వివాహాన్ని జరిపించి, ఆ ఆనందంలో ఉండగానే విధి ఇలా చిన్నచూపు చూసింది. మూడు దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
News November 21, 2025
వర్షాలు పడే అవకాశం పంటలు జాగ్రత్త: కలెక్టర్

వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఈ నెల 27, 28న వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు పంటల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. నూర్పిడి జరిగిన పంటలు, కోతలు కోసిన పంటలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆమె రైతులకు సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులకు సహకరించాలని, ధాన్యం వర్షానికి తడవకుండా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు.
News November 21, 2025
GNT: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత దేవిప్రియ వర్ధంతి

ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు దేవిప్రియ (షేక్ ఖాజాహుస్సేన్) వర్ధంతి నేడు. గుంటూరులో జన్మించిన ఆయన ‘పైగంబర కవుల’ బృందంలో ఒకరు. ఆయన రచించిన ‘గాలిరంగు’ కవిత్వానికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన పాత్రికేయుడిగా ‘ఉదయం’, ‘ఆంధ్రజ్యోతి’ వంటి దినపత్రికలలో పనిచేశారు. వ్యంగ్య, విమర్శనాత్మకమైన ఆయన ‘రన్నింగ్ కామెంటరీ’ కవిత్వం తెలుగు పత్రికా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించింది.


