News January 25, 2025
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కారు బోల్తా

తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద కారు బోల్తా పడింది. తమిళనాడుకు చెందిన భక్తులు శనివారం ఉదయం మొదటి ఘాట్ రోడ్లో దిగుతుండగా బోల్తా పడటంతో భక్తులకు ఎటువంటి గాయాలు కాలేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే పోలీసులు, విజిలెన్స్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Similar News
News February 25, 2026
2018 గ్రూప్-1 అధికారుల మూకుమ్మడి బదిలీ

AP: 2018 బ్యాచ్ గ్రూప్-1 నుంచి ఎంపికైన అధికారులందరినీ రిలీవ్ చేస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రిక్రూట్మెంట్ లోపాలపై విచారణ పూర్తయ్యేవరకు అప్రాధాన్య పోస్టుల్లో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. కాగా 2018 నోటిఫికేషన్ ద్వారా 167 మంది గ్రూప్-1 అధికారులుగా ఎంపికయ్యారు. వీరు గత రెండేళ్లుగా రాష్ట్రంలోని వివిధ కీలక శాఖల్లో విధుల్లో ఉన్నారు.
News February 25, 2026
ప్రగతిలో మార్టూరు అగ్రగామిగా నిలవాలి: కలెక్టర్

నెల రోజుల్లో మార్టూరు మండలం అన్ని విభాగాల్లో అగ్రస్థానంలో నిలవాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. మండల స్థాయి అధికారులు సమన్వయం, క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ర్యాంకింగ్ ఇచ్చి అభినందిస్తామన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజల కోసం తప్పనిసరిగా కుర్చీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News February 25, 2026
దేవరకొండ: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన డీసీహెచ్ఎస్

జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్త డా.మాతృనాయక్ బుధవారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రికార్డులు, ల్యాబ్ పరీక్షలను పరిశీలించి, ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్యంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. సూపరింటెండెంట్ డా. రవిప్రకాశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


