News January 25, 2025
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కారు బోల్తా

తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద కారు బోల్తా పడింది. తమిళనాడుకు చెందిన భక్తులు శనివారం ఉదయం మొదటి ఘాట్ రోడ్లో దిగుతుండగా బోల్తా పడటంతో భక్తులకు ఎటువంటి గాయాలు కాలేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే పోలీసులు, విజిలెన్స్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Similar News
News November 12, 2025
కోనసీమ: టెన్త్ విద్యార్థులకు alert..షెడ్యూల్ విడుదల

2025-26 విద్యాసంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదలైనట్లు డీఈవో సలీంబాషా తెలిపారు. రెగ్యులర్, ఫెయిల్ అయిన వారు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 13 – 25 వరకు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాలన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబరు 3 వరకు చెల్లించవచ్చన్నారు.
News November 12, 2025
APPLY NOW: CCRASలో ఉద్యోగాలు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (<
News November 12, 2025
సిద్దిపేట: దయ జూపరా మాపై కొడుకా!

అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన వృద్ధ దంపతులు మిట్టపల్లి వెంకటయ్య, లక్ష్మి తమ ఇద్దరు కుమారులు బాగోగులు చూసుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము కష్టపడి సంపాదించిన 8 ఎకరాల భూమిని ఇద్దరికీ రెండు భాగాలుగా పంచి ఇచ్చినప్పటికీ ఎవరు కూడా చూడడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తిండి పెట్టాలని అడిగినందుకు కొట్టి, కాళ్లు విరగొట్టారని తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆర్డీవోకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.


