News January 25, 2025
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కారు బోల్తా

తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద కారు బోల్తా పడింది. తమిళనాడుకు చెందిన భక్తులు శనివారం ఉదయం మొదటి ఘాట్ రోడ్లో దిగుతుండగా బోల్తా పడటంతో భక్తులకు ఎటువంటి గాయాలు కాలేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే పోలీసులు, విజిలెన్స్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Similar News
News February 16, 2025
శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు హీరో ప్రభాస్కు ఆహ్వానం

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆహ్వానించారు. ఆదివారం ప్రభాస్ను కలిసిన ఎమ్మెల్యే.. ఆహ్వాన పత్రికను అందజేశారు. కాగా ఇప్పటికే ప్రభాస్ మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను ఆధారంగా తీస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
News February 16, 2025
మస్తాన్ సాయి కేసు.. గవర్నర్కు లావణ్య లాయర్ లేఖ

AP: <<15471142>>మస్తాన్సాయి<<>> కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా మస్తాన్ సాయి కుటుంబాన్ని తొలగించాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు లావణ్య తరఫు లాయర్ లేఖ రాశారు. అతని నేరాల వల్ల దర్గా పవిత్రతకు భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అలాగే సీఎస్, గుంటూరు కలెక్టర్, మైనార్టీ సంక్షేమ కార్యదర్శికి కూడా లేఖలు రాశారు.
News February 16, 2025
సీఎం రేవంత్కు సబ్జెక్ట్ లేదు: ఎంపీ అర్వింద్

TS: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎంపీ అర్వింద్ విమర్శించారు. ప్రపంచ దేశాలు మోదీని గౌరవిస్తుంటే, ఆయన కులంపై సీఎం విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్కు సబ్జెక్ట్ లేదని, అడ్మినిస్ట్రేషన్లోనూ ఆయన విఫలమయ్యారన్నారు. కులగణనలో కోటి మంది ప్రజల లెక్క తెలియలేదని దుయ్యబట్టారు.