News February 4, 2025

తిరుమల: రథసప్తమి.. పోలీసులకు ఎస్పీ సూచనలు

image

TTD ప్రతి ఏటా వెంకటేశ్వర స్వామి వారి రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారని జిల్లా హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సోమవారం బందోబస్తు విధులకు హాజరైన సిబ్బందికి తిరుమల ఎస్.వి హై స్కూల్ గ్రౌండ్‌లో పలు సూచనలు చేశారు. పోలీసులు భక్తులతో గౌరవంగా, మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. రథసప్తమి రోజున ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకొనే విధంగా చర్యలు చేపట్టామన్నారు.

Similar News

News February 11, 2026

హరిత పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన వరంగల్ ఆర్డీఓ

image

వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఫిరంగిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘హరిత’ పోలింగ్ కేంద్రాన్ని వరంగల్ ఆర్డీఓ టి.సుమ బుధవారం సందర్శించారు. పర్యావరణ హితంగా, ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన ఈ కేంద్రాన్ని చూసి ఆమె ముగ్ధులయ్యారు. పోలింగ్ సరళిని అధికారులతో కలిసి సమీక్షించిన అనంతరం, హరిత పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ దగ్గర సహచర అధికారులతో కలిసి సరదాగా ఫొటోలు దిగారు.

News February 11, 2026

ఆస్పత్రిలో అభిషేక్ శర్మ.. మ్యాచుకు కష్టమే!

image

డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఢిల్లీలో గౌతమ్ గంభీర్ ఇంటికి డిన్నర్‌కు వెళ్లిన అభి.. నొప్పితో కాసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు క్రీడావర్గాలు వెల్లడించాయి. నిన్న ఆస్పత్రిలో చేరగా, నేడూ అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో రేపు నమీబియాతో జరిగే మ్యాచులో ఆడటం అనుమానమేనని సమాచారం. ఫిట్‌నెస్ ఆధారంగా FEB 15 పాక్‌తో మ్యాచ్ ఆడటంపై నిర్ణయం తీసుకోనున్నారు.

News February 11, 2026

సిద్దిపేట: ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్

image

సిద్దిపేట జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటర్లు ఉదయం నుండే బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఉంది. చేర్యాలలో 12 వార్డులు ఉండగా 44 మంది బరిలో నిలిచారు. 13,777 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గజ్వేల్‌లో 46,740, దుబ్బాకలో21,341, హుస్నాబాద్‌లో 19,227 మంది ఓటర్లు ఉన్నారు.