News February 10, 2025

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నలుగురు అరెస్టు

image

లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంలో CBI నలుగురిని అరెస్టు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ‘X’ వేదికగా పేర్కొన్నారు. భోలే బాబా డైరీకి (రూర్కీ, ఉత్తరాఖండ్) నాడు డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ(పునబాక) సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఎఆర్ డైరీ(దుండిగల్) ఎండి రాజు రాజశేఖరన్ లను అరెస్టు చేసినట్లు అందులో పేర్కొన్నారు.

Similar News

News March 14, 2026

HYD: ఓల్డ్ సిటీ ఇక ‘హైటెక్’ గుమ్మం!

image

ట్రాఫిక్ సమస్యతో విసిగిపోయిన టోలిచౌకీ వాసులకు త్వరలో కొత్త అనుభూతి పలకరించనుంది. టూంబ్స్ నుంచి బంజారా దర్వాజా వరకు రోడ్డు మధ్యలో పచ్చని మీడియన్లు, ఫ్లైఓవర్ కింద అందమైన జంక్షన్లతో ఈ ప్రాంతం సరికొత్తగా ముస్తాబవుతోంది. సుమారు రూ.3.05 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పనులు ప్రయాణికులకు కంటికి ఇంపుగా, మనసుకు హాయినివ్వనున్నాయి. భాగ్యనగర వైభవం మీ గుమ్మం ముందుకు రాబోతోంది.

News March 14, 2026

10 బాలిస్టిక్ మిస్సైల్స్‌ను ప్రయోగించిన నార్త్ కొరియా

image

నార్త్ కొరియా దాదాపు 10 బాలిస్టిక్ మిస్సైల్స్‌ను జపాన్ సముద్రం వైపు ప్రయోగించినట్లు సౌత్ కొరియా వెల్లడించింది. వీటి కెపాసిటీ, రేంజ్‌ను గుర్తించడం సాధ్యం కాలేదని తెలిపింది. జాయింట్ మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్న అమెరికా-సౌత్ కొరియాకు హెచ్చరికగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అణ్వాయుధ సామర్థ్యమున్న నార్త్ కొరియా మిస్సైల్స్ ప్రయోగం కలకలం రేపుతోంది.

News March 14, 2026

హనుమకొండ: ఇంటర్ పరీక్షకు 92% హాజరు నమోదు

image

జిల్లాలో నేడు నిర్వహించిన ఇంటర్ ఒకేషనల్ పరీక్షకు 92% హాజరు నమోదయింది. జిల్లాలో 905 మంది విద్యార్థులకు గాను 831 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 74 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు.