News July 17, 2024

తిరుమల లడ్డూ తయారిపై అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: టీటీడీ

image

తిరుమ‌ల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఎన్నో దశాబ్దాల నుంచి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు సంప్రదాయానుసారంగా తయారు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా టీటీడీపై అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీవారి పోటులో 980 మంది హిందూ మతానికి చెందిన పోటు కార్మికులు తమకు నిర్దేశించిన వివిధ విధులను నిర్వహిస్తున్నారని వివరించింది.

Similar News

News November 13, 2025

MP మిథున్ రెడ్డికి జనసేన కౌంటర్

image

మిథున్ రెడ్డి సోషల్ మీడియాలో బుకాయిస్తే ఆయన తండ్రి <<18276752>>ఆక్రమణలు <<>>సక్రమం కావని జనసేన విమర్శించింది. ‘1968 SEP 16న మంగళంపేట ఫారెస్ట్ గెజిట్ ప్రకారం 76ఎకరాలున్న మీ భూమి 103.98 ఎకరాలు ఎలా అయ్యిందో చెబుతారా మిథున్ రెడ్డి. అడవిని ఎలా కబ్జా చేశారో మీ తండ్రిని అడగండి. 32.63ఎకరాల అడవిని కబ్జా చేసేసినంత ఈజీ కాదు చట్టం నుంచి తప్పించుకోవడం. కాసేపట్లో మీ కబ్జా చిట్టా బయటికి వస్తుంది’ అని ట్వీట్ చేసింది

News November 13, 2025

కాణిపాకంలో జైళ్ల శాఖ డీజీపీ

image

కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారిని గురువారం జైళ్ల శాఖ డీజీపీ ఆంజనీ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటం బహుకరించారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.

News November 13, 2025

జైళ్ల శాఖ డీజీపీని కలిసిన చిత్తూరు SP

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ అంజనీ కుమార్‌ను గురువారం చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాకు వచ్చిన ఆయన్ను పోలీసు గెస్ట్ హౌస్‌లో కలిసి బొకే అందజేసి స్వాగతం పలికారు. అలాగే అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు ఆయన్ను కలిశారు.