News March 24, 2025

తిరుమల వెంకన్న సేవలో శిరూరు మఠం పీఠాధిపతి

image

ఉడుపి శ్రీ శిరూరు మఠం 31వ పీఠాధిపతి వేదవర్ధన తీర్థ స్వామిజీ తమ శిశు బృందంతో కలిసి సోమవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మహద్వారం వద్ద ఆలయ పేస్కర్ రామకృష్ణ, అర్చకులు స్వామికి మర్యాద పూర్వకంగా స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలో స్వామీజీకి తీర్థప్రసాదాలను అందజేశారు.

Similar News

News April 1, 2025

మంచిర్యాలలో సింగరేణి ఉద్యోగి ఇంట్లో చోరీ

image

మంచిర్యాలలోని ఎస్ఆర్ఆర్ కాలనీలో రాధాకృష్ణ అనే సింగరేణి ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 29న ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లోని తన కూతురు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో దుండగులు ఇంటి తాళం పగులగొట్టి లాకర్‌లోని రూ.65 వేలు విలువ చేసే 20 గ్రా బంగారం, 50 తులాల వెండి ఎత్తుకెళ్లారు. రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News April 1, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

ఏప్రిల్ 1, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.11 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.20 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.29 గంటలకు
ఇష: రాత్రి 7.42 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 1, 2025

NRPT: ‘ప్రభుత్వం LRS గడువు పొడిగించాలి’

image

ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) గడువు మరో రెండు నెలలు పొడిగించాలని బీజేపీ నారాయణపేట జిల్లా అధికార ప్రతినిధి రఘువీర్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. సరైన ప్రచారం, అవగాహన లేని కారణంగా చాలా మంది ఎల్ఆర్ఎస్ రుసుం కట్టలేదని అన్నారు. వెంచర్లలో ప్లాట్లు కొన్న వారికి ఎల్ఆర్ఎస్ వర్తింపజేయాలని కోరారు. వెంచర్లు చేసిన వారికి ప్లాట్లు అమ్ముకునే అవకాశం కల్పించాలని అన్నారు.

error: Content is protected !!