News November 12, 2024
తిరువూరులో అర్ధరాత్రి విషాదం

తిరువూరులో సోమవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. తిరువూరు లక్ష్మీపురానికి చెందిన ఇస్మాయిల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తన ఇంటి ఆవరణంలో ఉన్న పాకలో మంచం మీద పడుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో విద్యుత్ షాక్ తో ఇంటి పూరీపాక కాలిపోవడంతో పడుకున్న ఇస్మాయిల్ కూడా కాలిపోయాడు. స్థానికులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయగా వచ్చి మంటలను అర్పివేశారు.
Similar News
News October 9, 2025
కృష్ణా: ఉపాధ్యాయుల పోరుబాట.. రేపటి నుంచి బోధనేతర యాప్ల బహిష్కరణ

బోధనేతర పనులపై ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు పోరుబాటకు సిద్ధమయ్యారు. బోధనేతర అంశాలకు సంబంధించిన యాప్ లను శుక్రవారం నుండి బహిష్కరిస్తున్నట్టు ఫ్యాప్టో ప్రకటించింది. సంఘ పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్, జిల్లా విద్యాశాఖాధి ఆఫీసుల్లో వినతిపత్రాలు అందజేశారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పనులు మాత్రమే చేస్తామని ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ అంబటిపూడి సుబ్రహ్మణ్యం తెలిపారు.
News October 9, 2025
షాపుల యజమానులు అనుమతులు తీసుకోవాలి: ఎస్పీ

దీపావళి పండుగ పురస్కరించుకొని బాణసంచా తయారీ కేంద్రాలు, షాపులు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. గురువారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడారు. ప్రజల భద్రత, శ్రేయస్సులో భాగంగా పోలీస్ వారికి సహకరించాలన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా టపాసులు తయారు చేసినా, నిల్వ ఉంచిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు.
News October 9, 2025
విద్యార్థుల ఆరోగ్యం పట్ల దృష్టి సాధించండి: కలెక్టర్

కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో గురువారం సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.