News November 12, 2024

తిరువూరులో అర్ధరాత్రి విషాదం

image

తిరువూరులో సోమవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. తిరువూరు లక్ష్మీపురానికి చెందిన ఇస్మాయిల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తన ఇంటి ఆవరణంలో ఉన్న పాకలో మంచం మీద పడుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో విద్యుత్ షాక్ తో ఇంటి పూరీపాక కాలిపోవడంతో పడుకున్న ఇస్మాయిల్ కూడా కాలిపోయాడు. స్థానికులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయగా వచ్చి మంటలను అర్పివేశారు.

Similar News

News October 11, 2025

ధాన్యం సేకరణలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్

image

జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులు, టెక్నికల్ అసిస్టెంట్లకు ధాన్యం సేకరణపై అవగాహన శిక్షణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల నుంచి ధాన్యం సేకరణలో పారదర్శకత పాటించాలన్నారు. ధాన్యం తేమ శాతం, నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పరిశీలించి సేకరణ చేయాలని సూచించారు.

News October 10, 2025

కృష్ణా: గుంతల మయంగా గ్రామీణ ప్రాంత రహదారులు

image

రహదారుల నిర్మాణానికి కృషి చేస్తున్నామని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో దాదాపు 75 శాతం రహదారులు ఇప్పటికీ గుంతలమయంగానే ఉండటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా రహదారుల పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని అన్నారు. ఎన్నికల సమయంలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామన్నా హామీ ఎక్కడ అని ప్రశ్నించారు.

News October 10, 2025

సముద్ర తీర మడ భూముల మాయం.. అధికారుల మౌనం.!

image

కృష్ణా జిల్లాలోని సముద్రతీర ప్రాంతాల్లో మడ భూములు కనుమరుగవుతున్నాయి. పాలకుల కబంధహస్తాల్లో చిక్కుకున్న ఈ మడభూములు ఇప్పుడు చెరువులుగా మారాయి. ఇదే పరిస్థితి పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లోనూ కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో ఉన్న మడ భూములలో దాదాపు కనుచూపు మేర ఇప్పటికే చెరువులుగా మారిపోయాయని సమాచారం. ప్రకృతి సంపదలను రక్షించాల్సిన అధికారులు నిశ్చలంగా ఉండడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.