News April 4, 2025
తిరువూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

తిరువూరులో శుక్రవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజుపేటలో నివాసం ఉంటున్న షేక్ సుభాని అనే యువకుడు బైక్పై వెళ్తుండగా టిప్పర్ లారీ ఢొకొట్టడంతో స్పాట్లోనే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News January 10, 2026
సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా..! సమాచారం ఇవ్వండి- ఎస్పీ

సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని, పోలీసులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని విలువైన వస్తువులు లాకర్ల లోనే భద్రపరుచుకోవాలని వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి విజ్ఞప్తి చేశారు. పండుగకు ఊర్లకు వెళ్తారని ఇదే అవకాశంగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ముందుగానే పోలీసులకు సమాచారం ఇస్తే పెట్రోలింగ్లో భాగంగా ఆయా ఇండ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని అన్నారు.
News January 10, 2026
పుతిన్నూ అదుపులోకి తీసుకుంటారా?.. ట్రంప్ సమాధానమిదే!

వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురోను <<18751661>>అదుపులోకి<<>> తీసుకుని అమెరికా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అలానే రష్యా అధ్యక్షుడు పుతిన్ను కూడా పట్టుకోవాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ట్రంప్ ‘అలా చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా’ అని బదులిచ్చారు. పుతిన్తో తనకు మంచి రిలేషన్ ఉందని చెప్పారు. కానీ ఆయన విషయంలో నిరాశకు గురయ్యానని అన్నారు.
News January 10, 2026
పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్లో 17న తుక్కు వేలం

విశాఖలో పోలీస్ స్టేషన్లు, విభాగాలు నుంచి సేకరించిన నిరుపయోగమైన ఇనుము, అల్యూమినియం, చెక్క, ప్లాస్టిక్ వస్తువులు జనవరి 17న వేలం వేయనున్నట్లు విశాఖ సీపీ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. ఆరోజు ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు జనవరి 12 ఉదయం 10 నుంచి వస్తువులను చూసుకొనవచ్చన్నారు. వేలంలో పాల్గొనే వారు పోలీస్ బ్యారెక్స్, కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలన్నారు.


