News December 10, 2024

తిరువూరు నుంచి Dy.CM పవన్‌కు బెదిరింపు కాల్స్

image

Dy.CM పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి తిరువూరుకు చెందిన మల్లికార్జున రావుగా పోలీసులు గుర్తించారు. ఇతను పవన్ ఓఎస్డీకి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడినట్లు ఫిర్యాదులు అందగా..పోలీసులు రంగంలోకి దిగారు. ఎంజీ రోడ్డు నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు గుర్తించారు. అయితే ఆ ఏరియాలో ఆరా తీయగా అతని జాడలేదు.అతనే ఫోన్ చేశాడా.. ఎవరైనా అతని పేరుపై సిమ్ తీసుకున్నారా అని తెలియాల్సి ఉంది.

Similar News

News July 10, 2025

కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ విజయవాడ అమ్మాయికి కాంస్య పతకం
☞కృష్ణా జిల్లా వ్యాప్తంగా పీటీఎం
☞ పామర్రు – భీమవరం హైవే( వీడియో)
☞ గన్నవరం: కుమారులని రక్షించాలంటూ పవన్ కళ్యాణ్‌కు వినతి
☞ గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్‌గా భారత్: గవర్నర్
☞ మచిలీపట్నంలో 11న జర్నలిస్టులకు వర్క్ షాప్
☞ పెనమలూరు: భార్య పుట్టింటికి వెళ్లిందని.. ఆత్మహత్య  
☞కృష్ణా: డిగ్రీ పరీక్షల టైం టేబుల్ విడుదల
☞ విజయవాడ: నేటితో ముగిసిన శాకంబరి ఉత్సవాలు

News July 10, 2025

గన్నవరం: కుమారులని రక్షించాలంటూ పవన్‌కి తల్లి వినతి

image

ఉద్యోగాల కోసం ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో ఉన్న తన ఇద్దరి కుమారులను రక్షించాలంటూ సూర్యకుమారి Dy.CM పవన్‌ని గన్నవరం ఎయిర్‌పోర్టులో గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, విదేశాల్లో ఉన్నవారిని తిరిగి రప్పిస్తానని అన్నారు.

News July 10, 2025

మచిలీపట్నం: 11న ‘వార్తాలాప్’ జర్నలిస్ట్‌లకు వర్క్‌ షాప్

image

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన మచిలీపట్నంలో జర్నలిస్టులకు ‘వార్తాలాప్’ మీడియా వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు PIB డైరెక్టర్ రత్నాకర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు వలందపాలెంలోని G కన్వెన్షన్‌లో నిర్వహించే ఈ వర్క్ షాప్‌కు మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. జిల్లాలోని జర్నలిస్టులు ఈ వర్క్ షాప్‌లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.