News December 10, 2024

తిరువూరు నుంచి Dy.CM పవన్‌కు బెదిరింపు కాల్స్

image

Dy.CM పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి తిరువూరుకు చెందిన మల్లికార్జున రావుగా పోలీసులు గుర్తించారు. ఇతను పవన్ ఓఎస్డీకి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడినట్లు ఫిర్యాదులు అందగా..పోలీసులు రంగంలోకి దిగారు. ఎంజీ రోడ్డు నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు గుర్తించారు. అయితే ఆ ఏరియాలో ఆరా తీయగా అతని జాడలేదు.అతనే ఫోన్ చేశాడా.. ఎవరైనా అతని పేరుపై సిమ్ తీసుకున్నారా అని తెలియాల్సి ఉంది.

Similar News

News January 16, 2025

మానవత్వం చాటుకున్న మంత్రి కొలుసు పార్థసారధి

image

మంత్రి కొలుసు పార్థసారధి మానవత్వం చాటుకున్నారు. గురువారం ఏలూరు నుంచి విజయవాడకు వెళుతుండగా జాతీయ రహదారిపై కలపరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కోడూరుపాడుకు చెందిన శిరీష, ఆమె తల్లి తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళుతున్న మంత్రి ప్రమాదాన్ని చూసి తన కాన్వాయిని ఆపి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని అధికారులు ఆదేశించారు.

News January 16, 2025

కృష్ణా: పరీక్షా ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన బీపీఈడీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

News January 16, 2025

విజయవాడ: మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

విజయవాడ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో GNM సీట్లు పెంచుతూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న జీఎన్ఎం 30 సీట్లు ఉండగా వాటిని 60కి పెంచుతూ ఈ ఉత్తర్వులో పేర్కొంది. 30 నుంచి 60 మేరకు GNM సీట్లు పెంచుతూ వైద్యారోగ్య శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.