News April 7, 2025
తిరువూరు: బెట్టింగ్ వివాదం.. యువకుడిపై దాడి

తిరువూరులో బెట్టింగ్ విషయమై ఇద్దరు యువకుల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఐపీఎల్ మ్యాచ్ విషయమై ఇద్దరి మధ్య క్వార్టర్ బాటిల్ పందెం ఒప్పందం కుదిరింది. కాగా నవీన్ కుమార్ పందెం ఓడిపోవడంతో మద్యం కొనివ్వాలి అని కోరగా అతను నిరాకరించడంతో, మద్యం మత్తులో ఉన్న మహేశ్ ఖాళీ సీసాతో నవీన్పై పలుచోట్ల దాడి చేయగా, తీవ్రంగా గాయపడిన నవీన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 22, 2026
తిరుపతి: ముగిసిన ఐదో విడత ‘గరుడ అట్లాస్’

తిరుపతి పరిసర ప్రాంతాల్లో పక్షిజాతి వైవిధ్యాన్ని శాస్త్రీయంగా నమోదు చేసే గరుడ అట్లాస్ ఐదో విడత పూర్తైంది. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 274 పక్షిజాతులు నమోదు కాగా, ప్రస్తుత విడతలోనే 192 జాతులు గుర్తించారు. IISER తిరుపతి ఆధ్వర్యంలో, తిరుపతి నేచర్ సొసైటీ, అటవీ శాఖ సహకారంతో 72 గ్రిడ్లలో సర్వే నిర్వహించారు. పట్టణ విస్తరణ, భూ వినియోగ మార్పుల ప్రభావాలను అంచనా వేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
News February 22, 2026
కర్నూలులో బాక్సింగ్ రింగ్ సిద్ధం!

కర్నూలులో ఆదివారం జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి (DSDO) భూపతి రావు ప్రారంభించారు. బాక్సింగ్ వంటి వ్యక్తిగత క్రీడల్లో ప్రతిభ చాటితే విద్యా, ఉద్యోగ రంగాల్లో గొప్ప అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. క్రీడలు విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని DSDO అన్నారు.
News February 22, 2026
‘వాస్తు’ అనేది నమ్మకమా, మూఢనమ్మకమా?

వాస్తుశాస్త్రం నమ్మకమే కాదు! పంచభూతాల కలయిక అని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘కులమతాలకు అతీతంగా ప్రకృతిని ఆస్వాదించే ప్రతి ఒక్కరికీ వాస్తు వర్తిస్తుంది. ప్రకృతి నియమాలు గౌరవించడమే వాస్తు అసలు ఉద్దేశం. గాలి, వెలుతురు వంటి సహజ వనరులను సమన్వయం చేస్తూ జీవిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. వాస్తు నియమాలు విస్మరిస్తే ఎవరికైనా ఇబ్బందులు తప్పవని నిపుణుల అభిప్రాయం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


