News March 21, 2025
తిరువూరు మున్సిపల్ ఛైర్పర్సన్ మార్పుపై ఉత్కంఠ

తిరువూరులో మున్సిపల్ ఛైర్పర్సన్ మార్పు అంశంపై వైసీపీ ఆచూతూచి అడుగులు వేస్తోంది. ఒప్పందం ప్రకారం ఛైర్పర్సన్ మార్పు అంశాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లిన స్థానిక నేతలు.. ఛైర్మన్ను మార్చడం వల్ల పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. కొందరు కౌన్సిలర్లు పార్టీ మారుతారని లోకల్గా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో మున్సిపల్ పీఠాన్ని YCP నిలబెట్టుకుంటుందా? అనేది ఆసక్తిగా మారింది.
Similar News
News November 26, 2025
తొలిరోజు ముగిసిన జోగి రమేష్ సోదరుల సిట్ విచారణ

నకిలీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ సోదరుల సిట్ (SIT) విచారణ బుధవారం మొదటి రోజు ముగిసింది. విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్లో అధికారుల సమక్షంలో గంటపాటు విచారణ కొనసాగింది. అనంతరం వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఇబ్రహీంపట్నం నకిలీ లిక్కర్ కేసులో జోగి రమేష్ (A18), జోగి రాము (A19) నిందితులుగా ఉన్నారు.
News November 26, 2025
ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

రైతన్న మీ కోసం కార్యక్రమం స్ఫూర్తితో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన, ఇప్పటికే రూ.49.70 కోట్ల విలువైన 20,818 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
News November 26, 2025
కంది: పదిలో 100% ఉత్తీర్ణత సాధించాలి: డీఈవో

కంది మండలం కాశీపూర్ కేజీబీవీ పాఠశాలలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. 100% ఫలితాలు సాధించేలా ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని పేర్కొన్నారు. ఆయన వెంట పాఠశాల ప్రత్యేక అధికారి ఉన్నారు.


