News March 21, 2025

తిరువూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ మార్పుపై ఉత్కంఠ

image

తిరువూరులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ మార్పు అంశంపై వైసీపీ ఆచూతూచి అడుగులు వేస్తోంది. ఒప్పందం ప్రకారం ఛైర్‌పర్సన్ మార్పు అంశాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లిన స్థానిక నేతలు.. ఛైర్మన్‌ను మార్చడం వల్ల పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. కొందరు కౌన్సిలర్లు పార్టీ మారుతారని లోకల్‌గా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో మున్సిపల్ పీఠాన్ని YCP నిలబెట్టుకుంటుందా? అనేది ఆసక్తిగా మారింది.

Similar News

News November 18, 2025

పొగ మంచు వాతావరణంలో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ

image

ప్రస్తుత శీతాకాలంలో పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైవర్లు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ములుగు ఎస్పీ శబరీశ్ అన్నారు. తెల్లవారుజామున, రాత్రివేళ సాధ్యమైనంతవరకు ప్రయాణాలను తగ్గించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప రోడ్డు పక్కన భారీ వాహనాలు నిలప వద్దని అన్నారు. ఆ సమయంలో హాజర్ లైట్లను ఆన్ చేయాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు.

News November 18, 2025

పొగ మంచు వాతావరణంలో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ

image

ప్రస్తుత శీతాకాలంలో పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైవర్లు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ములుగు ఎస్పీ శబరీశ్ అన్నారు. తెల్లవారుజామున, రాత్రివేళ సాధ్యమైనంతవరకు ప్రయాణాలను తగ్గించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప రోడ్డు పక్కన భారీ వాహనాలు నిలప వద్దని అన్నారు. ఆ సమయంలో హాజర్ లైట్లను ఆన్ చేయాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు.

News November 18, 2025

విశాఖ: బాలోత్సవం-2025 పోస్టర్ ఆవిష్కరణ

image

ఆనందపురం‌లో డిసెంబర్ 9–11వ తేదీల్లో సెయింట్ ఆంథోనీ పాఠశాలలో జరగనున్న 3వ మహా విశాఖ బాలోత్సవం-2025 పోస్టర్‌ను DEO ఎన్.ప్రేమకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం నిర్వాహకులు, సేవా సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. గత సంవత్సరం 8,000 కంటే ఎక్కువ మంది పిల్లలు పాల్గొన్న నేపథ్యంలో ఈసారి మరింత విస్తృతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ పూర్తి సహకారం ప్రకటించింది.