News February 7, 2025

తిరువూరు: రోగి కడుపులో 10 MM రాళ్లు

image

తిరువూరులో ఓ రోగి కడుపు నొప్పితో హాస్పిటల్లో గురువారం చేరాడు. దీంతో డాక్టర్లు పరీక్షలు నిర్వహించగా గాలి బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అనుభవజ్ఞులైన వైద్య బృందం ల్యాప్రోస్కోపి ద్వారా శాస్త్ర చికిత్స నిర్వహించి గాలి బ్లాడర్‌లో ఉన్న రెండు 10 MM రాళ్లను తొలగించారు. కాగా రోగి వైద్యులు వాటిని చూచి ఆశ్చర్యపోయారు.

Similar News

News November 10, 2025

ప్రెగ్నెంట్లు పారాసిటమాల్ వాడొచ్చు: సైంటిస్టులు

image

గర్భిణులు పారాసిటమాల్ వాడితే పిల్లలకు ఆటిజమ్/ADHD వస్తుందనే వాదనకు ఆధారాలు లేవని బ్రిటిష్ మెడికల్ జర్నల్ వెల్లడించింది. ప్రెగ్నెంట్లు పారాసిటమాల్/ఎసిటమినోఫెన్ లాంటి పెయిన్ కిల్లర్లు వాడొద్దని ఇటీవల ట్రంప్ పిలుపునివ్వడంతో సైంటిస్టులు పరిశోధన చేశారు. ‘ప్రెగ్నెన్సీలో హై ఫీవర్ బిడ్డపై ప్రభావం చూపుతుంది. పారాసిటమాల్ సురక్షితమైన డ్రగ్. కచ్చితంగా తీసుకోవచ్చు’ అని WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య తెలిపారు.

News November 10, 2025

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..!

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.17,900, వండర్ హాట్ (WH) మిర్చి రూ.17వేలు పలికింది. అలాగే, తేజ మిర్చి ధర రూ.14,800, దీపిక మిర్చి రూ.14వేలు, టమాటా మిర్చి రూ.30వేలు పలికిందని వ్యాపారులు చెప్పారు. 2043 రకం మిర్చికి రూ.22వేలు, 5531 రకం మిర్చికి రూ.15వేల ధర వచ్చింది.

News November 10, 2025

శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఎంత ఉన్నాయో తెలుసా..!

image

శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ (శ్రీవాణి) ద్వారా భక్తులు రూ.10వేలు విరాళం ఇస్తారు. వారికి బ్రేక్ దర్శనాన్ని టీటీడీ కల్పిస్తుంది. ఇప్పటి వరకు రూ. 2300 కోట్లు విరాళాలు అందాయని ఇటీవల టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇందులో రూ.600 కోట్లు ఖర్చు కాగా.. రూ. 1700 కోట్లు ఉన్నాయి. తాజాగా 5వేల ఆలయాల నిర్మాణాలకు సంబంధించి రూ. 750 కోట్లు టీటీడీ బోర్డు మంజూరు చేసింది.