News February 7, 2025
తిరువూరు: రోగి కడుపులో 10 MM రాళ్లు

తిరువూరులో ఓ రోగి కడుపు నొప్పితో హాస్పిటల్లో గురువారం చేరాడు. దీంతో డాక్టర్లు పరీక్షలు నిర్వహించగా గాలి బ్లాడర్లో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అనుభవజ్ఞులైన వైద్య బృందం ల్యాప్రోస్కోపి ద్వారా శాస్త్ర చికిత్స నిర్వహించి గాలి బ్లాడర్లో ఉన్న రెండు 10 MM రాళ్లను తొలగించారు. కాగా రోగి వైద్యులు వాటిని చూచి ఆశ్చర్యపోయారు.
Similar News
News October 27, 2025
విశాఖలో పలుచోట్ల నేలకొరుగుతున్న చెట్లు

మొంథా తుపాన్ నేపథ్యంలో వర్షంతో పాటు ఈదురు గాలులు బలంగా ఇస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలలో సోమవారం ఉదయం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రామాటాకీస్, కైలాసపురం ఎన్జీవో కాలనీ, రైల్వే క్వార్టర్స్, కంచరపాలెం తదితర ప్రాంతాలలో చెట్లు నేలకొరిగాయి. అడపా దడపా భారీ వర్షం కూడా కురుస్తోంది. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యింది.
News October 27, 2025
యజ్ఞంలా కోటి సంతకాల సేకరణ: YCP

AP: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ సీఎం జగన్ చేపట్టిన కోటి సంతకాల సేకరణ యజ్ఞంలా సాగుతోందని YCP ట్వీట్ చేసింది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారంది. పార్టీ నేతలు YS అవినాశ్రెడ్డి, YS మనోహర్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన కార్యక్రమం జరుగుతోందని పేర్కొంది. ప్రైవేటీకరణతో ప్రజలకు కలిగే నష్టాలను వివరిస్తూ సంతకాలు సేకరిస్తున్నారంది.
News October 27, 2025
మొంథా తుపాన్: విజయనగరానికి రూ.కోటి

మొంథా తుపాన్ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు నిధులు కేటాయించింది. విజయనగరం జిల్లాకు రూ.కోటి, పార్వతీపురం మన్యం జిల్లాకు రూ. 50లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లాలో తీర ప్రాంతం ఉండడంతో నష్టం అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రభుత్వం నిధులను రూ.కోటి మంజూరు చేసింది. ఆయా నిధులను నష్టం నివారణకు ఖర్చు చేయాల్సి ఉంది.


