News April 4, 2025
తిర్యాణి: యాక్సిడెంట్.. యువకుడి దుర్మరణం

నార్నూర్ మండలం గంగాపూర్లో ఎంగేజ్మెంట్కి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పుసిగూడ ఘాట్ వద్ద జరిగిన యాక్సిడెంట్లో యువకుడు దుర్మరణం చెందారు. యువకుడిని ఆటోలో ఉట్నూర్ ఆసుపత్రికి తరలించగా మృతిచెందారు. మృతుడు తొడసం జంగుగా గుర్తించారు. తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి భార్య పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 16, 2025
నేటి ముఖ్యాంశాలు

❁ రేపు ఏపీకి ప్రధాని.. ₹13వేల కోట్ల పనులకు శ్రీకారం
❁ నవంబర్ నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీలు: CM CBN
❁ ఏపీ ఆరోగ్యానికి YCP హానికరం: లోకేశ్
❁ TG: ఓట్ల చోరీతో గెలిచింది బీఆర్ఎస్సే: శ్రీధర్ బాబు
❁ మద్దతు ధరతోపాటు బోనస్ చెల్లింపులకు సిద్ధం: ఉత్తమ్
❁ జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి
❁ ఈ నెల 18న బంద్.. మద్దతు తెలిపిన BRS, BJP
❁ MH సీఎం ఫడణవీస్ ఎదుట లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్
News October 16, 2025
నారాయణపేట: హత్యాయత్నం కేసులో నిందితుడికి రిమాండ్: ఎస్ఐ

నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం మగ్దంపూర్ గ్రామానికి చెందిన రుక్కమూల నరసింహులుపై కత్తితో దాడి చేసిన జంజర్ల నరేశ్(25)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 10వ తేదీన “తన కూతురితో ఎందుకు మాట్లాడుతున్నావు” అని నరసింహులు ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైన నరేశ్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు పట్టుకుని జిల్లా జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్కు పంపినట్లు SI రమేశ్ తెలిపారు.
News October 16, 2025
వనపర్తిలో ఇంటర్ విద్యార్థి అదృశ్యం

వనపర్తిలోని ఓ కాలేజీ విద్యార్థి అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గద్వాల జిల్లాకు చెందిన పోతులపాడు సంజీవ (16) వనపర్తిలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.ఈనెల 10న మధ్యాహ్నం కాలేజీ నుంచి ఆ విద్యార్థి ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు.ఇప్పటివరకు అతడి ఆచూకీ లభించలేదు. దీంతో విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు.