News April 4, 2025
తిర్యాణి: యాక్సిడెంట్.. యువకుడి దుర్మరణం

నార్నూర్ మండలం గంగాపూర్లో ఎంగేజ్మెంట్కి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పుసిగూడ ఘాట్ వద్ద జరిగిన యాక్సిడెంట్లో యువకుడు దుర్మరణం చెందారు. యువకుడిని ఆటోలో ఉట్నూర్ ఆసుపత్రికి తరలించగా మృతిచెందారు. మృతుడు తొడసం జంగుగా గుర్తించారు. తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి భార్య పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 13, 2025
నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి

మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర అభివృద్ధిలో భాగంగా Y జంక్షన్ నుంచి జంపన్న వాగు వరకు చేపట్టిన నాలుగు లైన్ల రోడ్డు, డివైడర్, ప్లాంటేషన్ పనులను నెల రోజుల్లోపు పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మేడారంలో పర్యటించిన మంత్రి, జాతర సమీపిస్తున్నందున పనుల వేగాన్ని పెంచాలన్నారు.
News November 13, 2025
పెదపాలపర్రులో వ్యక్తి అస్థిపంజరం లభ్యం

ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో పాడుబడిన పెంకుటింట్లో బుధవారం కుళ్లిపోయిన వ్యక్తి అస్థిపంజరం లభ్యమైంది. పిల్లులు పట్టుకోవడానికి వెళ్లిన వ్యక్తి ఈ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వీరభద్రరావు వివరాలు సేకరించారు. నాలుగు నెలల క్రితం అదృశ్యమైన రైతు సంకురాత్రి తులసీ మాధవరావు (59)గా బంధువులు ఈ అస్థిపంజరాన్ని గుర్తించారు. కేసు నమోదు చేశారు.
News November 13, 2025
బాపట్ల: న్యుమోనియా గురించి అవగాహన కల్పించాలి

ప్రపంచ న్యుమోనియా దినోత్సవం సందర్భంగా సోషల్ అవేర్నెస్ అండ్ యాక్షన్ ఆన్ న్యుమోనియా కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. న్యుమోనియా నియంత్రణకు టీకాలు, శుభ్రత, సమయానుకూల వైద్యం అవసరమని పేర్కొన్నారు. డిఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ, వైద్య అధికారులు పాల్గొన్నారు.


