News April 4, 2025
తిర్యాణి: యాక్సిడెంట్.. యువకుడి దుర్మరణం

నార్నూర్ మండలం గంగాపూర్లో ఎంగేజ్మెంట్కి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పుసిగూడ ఘాట్ వద్ద జరిగిన యాక్సిడెంట్లో యువకుడు దుర్మరణం చెందారు. యువకుడిని ఆటోలో ఉట్నూర్ ఆసుపత్రికి తరలించగా మృతిచెందారు. మృతుడు తొడసం జంగుగా గుర్తించారు. తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి భార్య పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 10, 2025
MBNR: ఓపెన్ SSC, INTER గడువు పొడిగింపు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 13లోగా (ఫైన్ లేకుండా) ఈనెల 23లోపు (ఫైన్తో) అప్లె చేసుకోవచ్చని, www.telanganaopenschool.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, చదువు మానేసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
#SHARE IT.
News October 10, 2025
లేఆఫ్స్పై ఆ ప్రచారంలో నిజం లేదు: TCS

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS)లో 50,000-80,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నారన్న ప్రచారాన్ని సంస్థ CHRO సుదీప్ కన్నుమల్ ఖండించారు. అందులో నిజం లేదని తెలిపారు. మిడ్& సీనియర్ లెవెల్ ఉద్యోగుల్లో 1% (6,000) మందిని మాత్రమే తొలగించినట్లు స్పష్టం చేశారు. కాగా FY26 Q1లో ఆ సంస్థ ఉద్యోగుల సంఖ్య 6,13,069గా ఉండగా, FY26 Q2లో 5,93,314కి తగ్గినట్లు IT వర్కర్స్ యూనియన్ NITES స్టేట్మెంట్ విడుదల చేసింది.
News October 10, 2025
ZHB: తేనెటీగల పెంపకం రైతులకు వరం

తేనెటీగల పెంపకం రైతులకు అదనపు ఆదాయం అందించే వరమని జిల్లా ఉద్యానవన అధికారి సీ.హెచ్. పండరి పేర్కొన్నారు. జహీరాబాద్లో కేవీకే ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఈ పెంపకం వల్ల పంట దిగుబడి కూడా పెరుగుతుందన్నారు. ఎపిస్మెల్లా ఫెరా, ఎపిశెరా వంటి రకాలు పెంపకానికి అనువని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధ్యమని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు.