News April 4, 2025
తిర్యాణి: యాక్సిడెంట్.. యువకుడి దుర్మరణం

నార్నూర్ మండలం గంగాపూర్లో ఎంగేజ్మెంట్కి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పుసిగూడ ఘాట్ వద్ద జరిగిన యాక్సిడెంట్లో యువకుడు దుర్మరణం చెందారు. యువకుడిని ఆటోలో ఉట్నూర్ ఆసుపత్రికి తరలించగా మృతిచెందారు. మృతుడు తొడసం జంగుగా గుర్తించారు. తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి భార్య పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 14, 2025
నెల్లూరు: 2 రోజుల పోలీస్ కస్టడీకి కిలాడి లేడీ డాన్ అరుణ

నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న కిలాడి లేడీ డాన్ అరుణ రెండు రోజుల కస్టడీ నిమిత్తం గురువారం విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై, అంగన్వాడి పోస్టులు ఇప్పిస్తామంటూ మోసగించినట్లు సూర్యాపేట పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు కస్టడీలో తీసుకుని విజయవాడకు తరలించారు.
News November 14, 2025
ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న డయాబెటిస్ బాధితులు

ఖమ్మం జిల్లాలో డయాబెటిస్ బాధితులు సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. జిల్లాలో 13,35,202 జనాభా ఉన్నారు. వీరిలో మధుమేహం లక్షణాలు ఉన్నవారు 55,829, అధిక రక్తపోటు ఉన్నవారు 77,604 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1.30 లక్షల మందిని ఎన్సీడీ పోర్టల్లో నమోదు చేసి వారికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేల్లో జిల్లా మధుమేహ వ్యాప్తిలో 10వ జాబితాలో చేరింది. ‘నేడు వరల్డ్ డయాబెటిస్ డే’
News November 14, 2025
యాసంగి వరి సాగు.. ఆలస్యం వద్దు

TG: యాసంగిలో వరి నార్లు పోసుకోవడానికి డిసెంబర్ 20 వరకు అవకాశం ఉంది. నాట్లు ఆలస్యమైన కొద్దీ పంట దిగుబడులతో పాటు బియ్యం శాతం తగ్గి నూకశాతం పెరుగుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. యాసంగి సాగుకు జగిత్యాల రైస్-1, కూనారం సన్నాలు, R.S.R-29325, M.T.M-1010, తెల్లహంస, సన్నగింజ రకాలైన తెలంగాణ సోన, K.N.M-1638, K.N.M-733, W.G.L-962, జగిత్యాల సాంబ J.G.L-27356, R.N.R-21278 రకాలు అనుకూలం.


