News March 18, 2025

తుంగతుర్తి: ప్రజల పక్షాన పోరాడేది BRS మాత్రమే: గాదరి 

image

ప్రభుత్వం చేతగాని, చేవలేని పని తనాన్ని ఎండగడుతూ ప్రజల పక్షాన కొట్లాడే ప్రధాన పాత్ర బీఆర్ఎస్ పోషిస్తోందని అందులో భాగంగా ఈనెల 20న నిర్వహించే పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశాన్ని, ఏప్రిల్ 27న భారీ బహిరంగసభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Similar News

News October 14, 2025

మెదక్: NMMS దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్‌ (NMMS) పరీక్ష దరఖాస్తుల గడువు ఈ మంగళవారంతో ముగియనుందని ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనుందని తెలిపారు. పూర్తి వివరాలకు bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

News October 14, 2025

NLG: వాతవరణం.. వరి పంటకు ప్రతికూలం

image

ఈ ఏడాది వర్షాలు రైతుల వెన్ను విరుస్తున్నాయి. జిల్లాలో సాగు చేసిన వరి పంట ప్రస్తుతం కంకి వెళ్లే దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో పొట్టదశలో, మరికొన్ని చోట్ల కంకి వెళ్లి గింజపోసుకునే దశలో ఉన్నాయి. అయితే గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రతికూలంగా మారాయి. వరిపొట్టలోకి నీరు చేరడంతో చీడపీడలు ఎక్కువవుతున్నాయి. కంకి వెళ్లిన పంటలో సుంకు రాలిపోతోంది. కంకి వెళ్లి గింజపోసుకుంటున్న వరి వానలకు నేలవాలుతోంది.

News October 14, 2025

KNR: నాడు YSR-KVP.. నేడు రేవంత్-శ్రీధర్ బాబు

image

దివంగత YSRకి KVP ఎలా ఆత్మలా ఉండేవారో CM రేవంత్‌కి మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు అలా ఉంటున్నారనడంలో సందేహం లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయన అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారు. అసెంబ్లీ, విదేశీ, 4th సిటీ, పాలనాపరమైన వ్యవహారాలు, ప్రతిపక్షాలను కట్టడి చేయడంలో తన MARK చూపిస్తూ రైజింగ్ TGలో కీరోల్ పోషిస్తున్నారు. శ్రీధర్ బాబు నిర్ణయమంటే CM డెసిషన్ అన్నట్లుగా పరిస్థితులున్నాయి.