News April 15, 2025

తునిలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

image

తుని మండలం కె.సీతయ్యపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సూరాడ నూకరత్నం (26) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నూకరత్నం భర్త శివ విషప్రయోగం చేసి హతమార్చినట్లు మృతురాలి తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News December 8, 2025

39పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 39 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ, CA/ICWAI, డిప్లొమా, బీఎస్సీ(MPC), ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bvfcl.com/

News December 8, 2025

గ్లోబల్ సమ్మిట్లో తెలుగు సినిమా దమ్ము

image

HYD శివారు మీర్‌ఖాన్‌పేట భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్లో మన తెలుగు సినిమాల దమ్మెంటో చూపించటం కోసం ప్రత్యేక ప్రదర్శన జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. న్యూ టెక్నాలజీ, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు, ఇందులో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేక వేదిక కానుంది.

News December 8, 2025

చిన్నవాడైన అల్లుడి కాలును మామ ఎందుకు కడుగుతారు?

image

పెళ్లి కొడుకును సాక్షాత్తూ నారాయణ స్వరూపంగా భావిస్తారు. పెళ్లి సమయంలో, అల్లుడి పాదాలను కడగడం అనేది తన కూతురిని తీసుకెళ్తున్న దేవుడికి ఇచ్చే గౌరవ మర్యాదగా, సేవగా పరిగణిస్తారు. ఈ ఆచారం ద్వారా, కూతురి తల్లిదండ్రులు తమ అల్లుడి పట్ల తమ భక్తిని, విధేయతను తెలియజేస్తారు. ఇది అల్లుడిని తమ ఇంటికి తీసుకువచ్చిన శుభ సంకేతంగా, దైవానుగ్రహంగా కూడా నమ్ముతారు.