News February 24, 2025

తునిలో 17 మంది వైసీపీ కౌన్సిల్ సభ్యులు రాజీనామా?

image

తుని పురపాలక వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా నేపథ్యంలో నగరంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఊహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 17 మంది వైసీపీ కౌన్సిల్ సభ్యులు రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కౌన్సిలర్లతో ఆదివారం సమావేశమయ్యారు. కౌన్సిల్ సభ్యులు రాజీనామా చేస్తారా అనే విషయం నేడు ప్రెస్‌మీట్‌లో తేలనుంది.

Similar News

News February 26, 2026

BREAKING: చుంచుపల్లి: భారీగా గంజాయి పట్టివేత

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో గురువారం రూ.2 కోట్ల విలువైన 400 కేజీల గంజాయి పట్టుబడింది. పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా కంటైనర్ లారీలో సినీ ఫక్కీలో గంజాయిని తరలిస్తుండగా చుంచుపల్లి మండలంలోని కంకర మిల్లు వద్ద పోలీసులు పట్టుకున్నారు. కాగా పట్టుబడిన గంజాయి తరలిస్తున్న వ్యక్తుల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీస్ శాఖ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

News February 26, 2026

నిర్మల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ బదిలీ

image

నిర్మల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌)గా బదిలీ చేయగా, నిర్మల్ కొత్త అదనపు కలెక్టర్‌గా కరీంనగర్ డీఆర్ఓ వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. జిల్లాలో తన పదవీ కాలంలో సమర్థవంతంగా సేవలు అందించిన ఫైజాన్ అహ్మద్, త్వరలోనే కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.

News February 26, 2026

WNP: లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్‌గా కీమ్యా నాయక్

image

వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా సేవలందించిన ఆయనను, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా కేటాయించింది. జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పాలనను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మార్పు చేపట్టింది. త్వరలోనే తన కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు.