News March 7, 2025
తుని : ఇంటర్ విద్యార్థి సూసైడ్

పరీక్షల ఒత్తిడితో పాటు అనారోగ్యంతో గురువారం ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు. తునిలో చదువుతున్న అనకాపల్లికి చెందిన జోగా సృజన జయప్రియ (17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసి ఇంటికి వచ్చింది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘నా చావుకు నా అనారోగ్యమే కారణం’ అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News November 25, 2025
కోకో తోటల్లో కొమ్మ కత్తిరింపులు – లాభాలు

కోకో తోటల్లో రెండేళ్ల వరకు మొక్క సింగిల్ కొమ్మతో పెరిగేలా చూడాలి. పంట నాటిన మూడేళ్ల తర్వాత కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేయాలి. మే 15 – జులై 15లోపు ప్రధాన కొమ్మలను కత్తిరించాలి. దీని వల్ల SEP,OCT,NOV నెలల్లో పూత బాగా వస్తుంది. నేలను చూసే కొమ్మలను, నేల నుంచి 3 అడుగుల వరకు కొమ్మలు లేకుండా కత్తిరించాలి. పదేళ్లు దాటిన తోటల్లో చెట్లు 7 అడుగులలోపే ఉండేలా చూడాలి. దీని వల్ల కాయ పెరుగుదల బాగుంటుంది.
News November 25, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నేడు మంగళవారం బంగారం వెండి ధరలు వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్లు 1 గ్రాము: రూ.12590
☛ బంగారం 22 క్యారెట్లు 1 గ్రాము: రూ.11583
☛ వెండి 10 గ్రాములు రూ.1616
ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నేడు మంగళవారం బంగారం వెండి ధరలు వివరాలు:
News November 25, 2025
లేటెస్ట్ అప్డేట్స్

* TG సచివాలయంలో ప్రారంభమైన క్యాబినెట్ భేటీ.. పంచాయతీ ఎన్నికల సన్నద్ధత, విద్యుత్ శాఖ సంబంధిత అంశాలపై చర్చ
* స్థానికసంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో మ.2.15కు విచారణ
* మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్న వైసీపీ చీఫ్ జగన్.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు క్యాంప్ ఆఫీసుకు రాక
* నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్, రాము, జనార్దన్ రావుతో పాటు నలుగురికి డిసెంబర్ 9 వరకు రిమాండ్ పొడిగింపు


