News March 30, 2025

తుని: ట్రైన్ నుంచి జారిపడి వృద్ధురాలు మృతి

image

తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో తుని- అన్నవరం స్టేషన్ మధ్య రైలు నుంచి జారిపడి వృద్ధురాలు మృతి చెందిందని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలి వివరాలను తెలుసుకునేందుకు చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం తెలపగా.. మృతురాలు పలాసకు సమీపంలోని సైలాడ గ్రామానికి చెందిన అట్టాడ సరస్వతమ్మ (70)గా గుర్తించినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News December 2, 2025

పాలకొల్లు: ఏ తల్లికీ ఇలాంటి కష్టం రాకూడదు.!

image

పాలకొల్లులో కొడుకు చితికి తల్లి నిప్పు పెట్టిన విషాదకర ఘటన చోటుకుంది. బంగారువారి చెరువు గట్టుకు చెందిన సత్యవాణి కుమారుడు శ్రీనివాస్ తో కలిసి ఉంటోంది. భార్యతో విడాకులు తీసుకొన్న శ్రీనివాస్ మద్యానికి బానిసై అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. అయిన వాళ్లు లేకపోవడంతో తల్లి కైలాస రథంపై హిందూ శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన చూపరులను కలచివేసింది.

News December 2, 2025

మెదక్: సర్పంచ్ అభ్యర్థి బాండ్ పేపర్ వైరల్

image

పంచాయతీ పోరులో ఓ సర్పంచ్ అభ్యర్థి తన ఎన్నికల మేనిఫెస్టోను బాండ్ పేపర్‌పై రాసిచ్చిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. హవేలిఘనపూర్ మం. రాజిపేటతండాకు చెందిన ఓ అభ్యర్థి తానును ఎన్నికల్లో గెలిస్తే గ్రామంలో ఆడపిల్ల పుడితే రూ.2వేలు, అన్ని కులాల పండుగలకు రూ.20వేలు సహా ఇతర హామీలతో బాండ్ పేపర్ రాసిచ్చారు. ఈ హామీలు అమలు చేయకుంటే పదవీ నుంచి తొలగించాలంటూ పేర్కొన్నారు. కాగా ఈ బాండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

News December 2, 2025

అన్నవరం ఆలయానికి ఆరో స్థానం

image

ఐవీఆర్‌ఎస్ సర్వేలో అన్నవరం దేవస్థానానికి 6వ స్థానం దక్కింది. రాష్ట్రంలో ఉన్న ప్రధాన ఆలయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ప్రభుత్వం సర్వే చేసింది. అందులో అన్నవరం ఆలయం 69.7% తో ఆరో స్థానం దక్కించుకుంది. ప్రసాదానికి 77.6% బాగుందని వచ్చింది. శానిటేషన్ విషయంలో 64.2 శాతం మంది మాత్రమే నిర్వహణ బాగుందన్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 25 వరకు ఈ సర్వే జరిగింది. మరి మన అన్నవరం ఆలయ నిర్వహణపై మీ కామెంట్.