News March 26, 2025

తుని: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

తునిలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఫ్లైఓవర్‌పై జరిగిన ప్రమాదంలో విశాఖపట్నంకు చెందిన పద్మ (48) మృతి చెందారు. అన్నవరం నుంచి విశాఖకు కుమారుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఐ విజయబాబు తెలిపారు. అన్నవరంలో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లి ఆమె తిరుగు ప్రయాణమైనప్పుడు ఫ్లైఓవర్‌పై బైకును కారు ఢీకొట్టింది. ఆమె కింద పడిపోవడంతో పైనుంచి కారు చక్రాలు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు.

Similar News

News October 23, 2025

సోయా పంట కొనుగోలు ఎప్పుడు?

image

TG: ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 62,500 ఎకరాల్లో సోయా పంటను రైతులు సాగు చేశారు. చాలా ప్రాంతాల్లో పంట చేతికొచ్చి 15 రోజులు దాటింది. ఏటా మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. పంట సేకరిస్తుండగా ఈ ఏడాది ఇంకా ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. సోయాకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.5,328గా ఉంది. వర్షాలతో కొంత పంట నష్టపోయామని, మిగిలిన పంటనైనా ప్రభుత్వం త్వరగా కొనాలని రైతులు కోరుతున్నారు.

News October 23, 2025

ఆదిలాబాద్ TO అరుణాచలానికి RTC బస్సు

image

ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో నుంచి తమిళనాడు అరుణాచలం గిరిప్రదక్షిణకు సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆర్టీసీ డీఎం ప్రతిమా రెడ్డి తెలిపారు. ఈ బస్సు నవంబర్ 8న బయలుదేరి కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తుంది. తిరిగి వచ్చేటప్పుడు జోగులాంబ దేవాలయం చూసుకొని నవంబర్ 11న రాత్రి 10 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News October 23, 2025

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

BA, B.COM, BSC చదువుతున్న విద్యార్థులకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ గుడ్‌న్యూస్ ప్రకటించింది. 2019-24 మధ్యలో చేరిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించే గడువును పొడిగించింది. విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజును నవంబర్ 13లోపు చెల్లించాలని స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వర్సిటీ వెబ్ సైట్‌లో పూర్తి వివరాలున్నాయన్నారు. సందేహాలుంటే 040-23680333 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.