News March 26, 2025

తుని: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

తునిలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఫ్లైఓవర్‌పై జరిగిన ప్రమాదంలో విశాఖపట్నంకు చెందిన పద్మ (48) మృతి చెందారు. అన్నవరం నుంచి విశాఖకు కుమారుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఐ విజయబాబు తెలిపారు. అన్నవరంలో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లి ఆమె తిరుగు ప్రయాణమైనప్పుడు ఫ్లైఓవర్‌పై బైకును కారు ఢీకొట్టింది. ఆమె కింద పడిపోవడంతో పైనుంచి కారు చక్రాలు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు.

Similar News

News January 8, 2026

భిక్కనూరు: ఫార్మా ‘సీక్రెట్స్’ బట్టబయలు

image

భిక్కనూరులో ఫ్యూజన్ ఫార్మాకు ఇప్పటికే 2 ఎకరాల పర్మిషన్ ఉందని, ప్రస్తుత సేకరణ ‘విస్తరణ’ కోసమేనని తెలిసి జనం షాక్ అయ్యారు. ఆకుపచ్చ పరదాల చాటున అప్పుడే పనులు మొదలయ్యాయి. ఇదొక్కటే కాదు, మరికొన్ని కంపెనీలు కూడా సేకరణ జరగకుండానే పర్మిషన్లు పొందాయని పలువురు ఆరోస్తున్నారు. నాయకులు మాత్రం ‘పొలిటికల్ మైలేజ్’ చూస్తున్నారు తప్పా.. పనులు మొదలయ్యాక వీటిని ఆపడం సాధ్యమేనా? అని జనం ఆందోళన చెందుతున్నారు.

News January 8, 2026

జనవరి 8: చరిత్రలో ఈరోజు

image

* 1642: ప్రముఖ భౌగోళిక శాస్త్రజ్ఞుడు గెలీలియో మరణం. * 1942: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జననం * 1962: లియోనార్డో డావిన్సీ వేసిన ‘మోనాలిసా’ పెయింటింగ్‌ను USలో తొలిసారి ప్రదర్శించారు. * 1975: మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జైరాజ్ పుట్టినరోజు * 1983: హీరో తరుణ్ బర్త్‌డే (ఫొటోలో) * 1987: IND మాజీ క్రికెటర్ నానా జోషి మరణం

News January 8, 2026

కేరళలో ఫేక్ డిగ్రీ రాకెట్.. ఆస్ట్రేలియాలో దుమారం!

image

కేరళలో బయటపడిన ఫేక్ డిగ్రీ రాకెట్ ఆస్ట్రేలియాలో దుమారం రేపుతోంది. నకిలీ సర్టిఫికెట్లతో వస్తున్న విదేశీ విద్యార్థులను ప్రభుత్వం అడ్డుకోవడం లేదని ఆసీస్ సెనేటర్లు మండిపడుతున్నారు. వాటితోనే ఇక్కడ చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాగా ఫేక్ డిగ్రీలు అమ్ముతున్న 11 మందిని ఇటీవల కేరళ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు 10 లక్షల మందికి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు.