News April 24, 2024

తులం బంగారం, లక్ష రూపాయలు ఎప్పుడిస్తారు?: మహేశ్వర్ రెడ్డి

image

రాష్ట్రంలో కరవు కాటకాలు తీవ్రంగా ఉన్నాయని నిర్మల్ MLA మహేశ్వర్ రెడ్డి అన్నారు. వరి ధాన్యాన్ని కొనుగొలు చేయకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. CM మాటలు ప్రజలు నమ్మడం లేదని దేవుళ్ల మీద ప్రమాణం చేస్తున్నారన్నారు. కౌలు రైతులను కలుపుకుని రూ.90వేల కోట్లు రైతంగానికి ఖర్చు పెట్టే స్తోమత ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. వివాహాలకు తులం బంగారం, రూ.లక్ష ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Similar News

News November 27, 2025

ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సై..!

image

ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది. నేటి (గురువారం) నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలో మొత్తం 467 గ్రామ పంచాయతీలు, 3,822 వార్డులు ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ శనివారం వరకు కొనసాగుతుంది. ఈ నెల 30న నామినేషన్లను పరిశీలించి, అర్హత జాబితాను అధికారులు వెల్లడిస్తారు. బరిలో నిలిచేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.

News November 27, 2025

ఆదిలాబాద్‌లో బాల్య వివాహం అడ్డగింత

image

మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో బాల్య వివాహాన్ని అధికారులు బుధవారం అడ్డుకున్నారు. 16 ఏళ్ల బాలికకు మరొ కాలనీకి చెందిన 26 ఏళ్ల ఓ యువకుడితో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నారు. చైల్డ్ హెల్ప్ లైన్‌కు సమాచారం రావడంతో పెళ్లిని నిలిపివేసినట్లు చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, మావల ఎఎస్ఐ అంబాజి తెలిపారు. అనంతరం ఇరు కుటుంబీకులకు, అమ్మాయికి కౌన్సిలంగ్ ఇచ్చామన్నారు.

News November 27, 2025

ఆదిలాబాద్‌లో బాల్య వివాహం అడ్డగింత

image

మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో బాల్య వివాహాన్ని అధికారులు బుధవారం అడ్డుకున్నారు. 16 ఏళ్ల బాలికకు మరొ కాలనీకి చెందిన 26 ఏళ్ల ఓ యువకుడితో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నారు. చైల్డ్ హెల్ప్ లైన్‌కు సమాచారం రావడంతో పెళ్లిని నిలిపివేసినట్లు చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, మావల ఎఎస్ఐ అంబాజి తెలిపారు. అనంతరం ఇరు కుటుంబీకులకు, అమ్మాయికి కౌన్సిలంగ్ ఇచ్చామన్నారు.