News March 15, 2025

తుళ్లూరు: పోలీసులతో పటిష్ట బందోబస్తు

image

వెంకటపాలెంలో నేడు జరగబోవు శ్రీవారి కల్యాణానికి వెయ్యి మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ వద్ద సిబ్బందికి పలు సూచనలు చేశారు. బంధువు పొత్తు నిర్వహణకు వీలుగా సభా ప్రాంగణాన్ని సెక్టార్లుగా విభజించి ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను ఇన్‌ఛార్జ్ లుగా నియమించామని చెప్పారు.

Similar News

News October 23, 2025

గుంటూరులో పురాతన అగస్త్యేశ్వరస్వామి ఆలయం

image

గుంటూరు RTC బస్ స్టాండ్‌కు సమీపంలో అగస్త్యేశ్వరస్వామి ఆలయం అత్యంత పురాతనమైనది. చాళుక్యుల సామంతులైన పరిచ్ఛేద వంశానికి చెందిన పండయ్యరాజు దీనిని 12వ శతాబ్దంలో నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఈ శివలింగాన్ని వేలాది సంవత్సరాల క్రితం అగస్త్య మహర్షి ప్రతిష్టించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ చతురస్రాకారంలో శివలింగం దర్శనమిస్తుంది. ఆలయ ముఖ మండప స్తంభాలు చాళుక్యుల శిల్పకళా వైభవానికి నిదర్శనం.

News October 23, 2025

గుంటూరులో ట్రాఫిక్ నిర్వహణపై ఎస్పీ ఆకస్మిక పర్యటన

image

గుంటూరు నగరంలో ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ పనితీరును ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. పట్టాభిపురం, బ్రాడీపేట, కొత్తపేట, బస్టాండ్ సెంటర్, తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News October 23, 2025

GNT: స్కూల్స్‌కు సెలవుపై పేరెంట్స్ విమర్శలు

image

భారీ వర్షాల కారణంగా గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంపై తల్లిదండ్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉదయం 9 గంటల తర్వాత సెలవు ప్రకటించడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అప్పటికే పిల్లలు వర్షంలో తడుస్తూ పాఠశాలలకు వెళ్లిపోయారని, ఉదయం నుంచే వర్షం పడుతున్నందున ముందుగానే స్పందించి ఉండాల్సిందన్నారు. రేపటి సెలవు సమాచారమైనా ముందుగానే స్పష్టంగా ఇవ్వాలన్నారు.