News March 23, 2025
తుళ్లూరు: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

ఈనెల 31 తేదీన అమరావతి రాజధాని ప్రాంతంలో పీ4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆర్డిఓ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద జరుగుతున్న పనులు పరిశీలించి అధికారులకు ఆమె సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, డీఎస్పీ పాల్గొన్నారు.
Similar News
News March 29, 2025
31న జరగాల్సిన పరీక్ష వాయిదా: DEO

ఈనెల 31న రంజాన్ పండుగ సందర్భంగా ఆరోజు జరగవలసిన 10వ తరగతి సోషల్ పరీక్ష ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసినట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గుంటూరు జిల్లాలోని అన్ని యజమాన్యాల ప్రధానోపాద్యాయులు ఈ విషయం వెంటనే 10వ తరగతి విద్యార్ధులకు తెలియజేయాలని సూచించారు.
News March 29, 2025
నేరాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపాలి: ఎస్పీ

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో మార్చి-2025 నెల నేర సమీక్ష సమావేశంలో నిర్వహించారు. సమావేశంలో జిల్లా నేర సమీక్ష నిర్వహణ ప్రత్యేక అధికారి IG హరికృష్ణ పాల్గొని పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. నేరాల పరిశోధన, నియంత్రణ కొరకు తీసుకోవాల్సిన చర్యల గురించి దిశా నిర్దేశం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సతీశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
News March 28, 2025
GNT: మైనర్ బాలికతో ప్రేమ పెళ్లి.. పోక్సో కేసు నమోదు

బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువకుడు 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను వివాహం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ యువకుడిపై పట్టాభిపురం పీఎస్లో పోక్సో కేసు నమోదైంది. ఇద్దరూ పెళ్లి చేసుకున్న విషయాన్ని ఇరు కుటుంబాలు గోప్యంగా ఉంచాయి. ఆ మైనర్ బాలిక మరో వ్యక్తితో చాటింగ్ చేస్తుండటంతో ఆ కుటుంబాల్లో గొడవలు జరిగాయి. దీంతో వారు స్టేషన్ మెట్లు ఎక్కడంతో పెళ్లి జరిగి 8 నెలలైందని పోలీసులు గుర్తించారు.