News April 7, 2024
తూప్రాన్: చెట్టు నరికిన వ్యక్తికి రూ.5 వేల జరిమానా

తూప్రాన్ పట్టణంలో హరితహారంలో నాటిన చెట్టు నరికిన కేతారంకు రూ.5 వేల జరిమానా విధించినట్లు మున్సిపల్ కమిషనర్ కాజా మోహిజుద్దీన్ తెలిపారు. తూప్రాన్ పట్టణంలోని పాత సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద హరితహారంలో నాటిన చెట్టును నరికినట్లు వివరించారు. మున్సిపల్ మేనేజర్ రఘువరన్, టౌన్ ప్లానింగ్ జూనియర్ అసిస్టెంట్ దుర్గయ్య పరిశీలన చేసి జరిమానా విధించారు.
Similar News
News December 15, 2025
MDK: గతంలో పారిశుద్ధ్య కార్మికుడు.. నేడు ఉపసర్పంచ్

ఐదేళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడు, ట్రాక్టర్ డ్రైవర్గా విధులు నిర్వహించిన యువకుడు ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. నార్సింగి మండలం శేరిపల్లికి చెందిన చెప్యాల విజయ్ కుమార్ గ్రామంలో రెండో వార్డులో పోటీ చేసి 36 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో గత రాత్రి జరిగిన ఉపసర్పంచ్ ఎన్నికల్లో విజయ్ కుమార్ను ఉపసర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
News December 15, 2025
మెదక్: 12 చోట్ల ఉప సర్పంచ్ ఎన్నికలు

మెదక్ జిల్లాలో నిన్న జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచ్ ఎన్నిక జరగనిచోట ఈరోజు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 142 పంచాయతీలలో ఎన్నికలు జరగ్గా 12 చోట్ల ఉపసర్పంచ్ ఎన్నికలు కొన్ని అనివార్య కారణాలవల్ల జరగలేదని డీపీఓ యాదయ్య తెలిపారు. ఈరోజు వార్డు సభ్యులకు నోటీసు జారీ చేసి ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నట్లు చెప్పారు.
News December 15, 2025
చేగుంట: 4 ఓట్ల తేడాతో గెలుపు

చేగుంట మండలం పోలంపల్లి సర్పంచిగా కొండి రాజ్యలక్ష్మి విజయం సాధించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి రాజ్యలక్ష్మి సమీప ప్రత్యర్థి తప్ప మేనకపై 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.


