News April 4, 2025

తూప్రాన్: ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో అవార్డు

image

తూప్రాన్ మున్సిపాలిటీకి ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో లక్ష్యాన్ని సాధించినందుకు బెస్ట్ అప్రిసియేషన్ అవార్డు దక్కింది. ఈరోజు హైదరాబాదులో సీడీఎంఏ అధికారి చేతుల మీదుగా బెస్ట్ అప్రిసియేషన్ అవార్డును కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి అందుకున్నారు. 2024-25 సంవత్సరానికి 82.17% ప్రాపర్టీ టాక్స్ వసూలు చేశారు. అవార్డు లభించినందుకు మేనేజర్ రఘువరన్, వార్డు అధికారులు, సిబ్బందిని అభినందించారు.

Similar News

News April 19, 2025

ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించాలి: అడిషనల్ కలెక్టర్

image

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ శుక్రవారం సూచించారు. ఈ మేరకు నిజాంపేట మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఆర్ వెంకటాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు సమర్థవంతంగా వేగవంతంగా జరపాలని, రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆదేశించారు.

News April 19, 2025

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి భూ భారతి: కలెక్టర్

image

ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం భూ భారతిని అమలు చేస్తున్నట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. భూ భారతి పోర్టల్ అమలులో భాగంగా శుక్రవారం అల్లాదుర్గం మండలం చేవెళ్ల గ్రామంలో రైతు వేదికలో భూ భారతి చట్టం -2025పై అవగాహన కార్యక్రమంలో హాజరయ్యారు. అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి, తహశీల్దార్ మల్లయ్య, కాగ్రెస్ మండల ప్రెసిడెంట్ శేషా రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

News April 18, 2025

న్యాయవాదుల అభిమానం మరువలేనిది: జిల్లా ప్రధాన న్యాయమూర్తి

image

మెదక్ జిల్లా న్యాయవాదుల అభిమానం మరువలేనిదని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మి శారద అన్నారు. సూర్యాపేటకు బదిలీ అయిన సందర్భంగా మెదక్ కోర్టులో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సన్మానం ఏర్పాటు చేశారు. ఇక్కడ సేవలందించడం గొప్పవరం అన్నారు. ప్రతి న్యాయవాది పేద ప్రజలకు అండగా నిలబడాలన్నారు. మెదక్ జిల్లా న్యాయవాదుల అభిమానం వెలకట్టలేనిదని, ఇక్కడి ప్రజల అభిమానం మరువలేనిదని ఆమె పేర్కొన్నారు.

error: Content is protected !!