News April 11, 2024

తూప్రాన్: రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర వాసి మృతి

image

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధి టోల్ ప్లాజా వద్ద ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన సురేష్ గంగారం(51) మృతి చెందాడు. టోల్ ప్లాజా వద్ద పార్కు చేసిన కంటైనర్ లారీ అకస్మాత్తుగా ముందుకు వెళ్లి రోడ్డుకు అడ్డంగా డివైడర్ పైకెక్కింది. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కామారెడ్డికి చెందిన డ్రైవర్ అనిల్ తీవ్రంగా గాయపడ్డారు.

Similar News

News November 23, 2025

మెదక్‌లో JOBS.. APPLY NOW

image

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని మెదక్ సఖి సెంటర్‌లో పొరుగు సులభ పద్ధతిలో దిగువ తెలిపిన ఉద్యోగాల నియామకానికి అర్హులైన మహిళ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అధికారి హేమ భార్గవి సూచించారు. సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్ పోస్టులకు డిసెంబర్ 10లోపు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం మెదక్‌లో సమర్పించాలని తెలిపారు.

News November 23, 2025

మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారానే ప్రజావాణి: కలెక్టర్

image

మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 24న హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఎన్నికల అవగాహన సదస్సులో అధికారులు పాల్గొంటున్న కారణంగా ఆయా శాఖల అధికారులు ప్రజావాణికి అందుబాటులో ఉండాలని తెలిపారు.

News November 23, 2025

మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారానే ప్రజావాణి: కలెక్టర్

image

మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 24న హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఎన్నికల అవగాహన సదస్సులో అధికారులు పాల్గొంటున్న కారణంగా ఆయా శాఖల అధికారులు ప్రజావాణికి అందుబాటులో ఉండాలని తెలిపారు.