News June 12, 2024
తూ.గో: ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్ చిత్రం

నరసాపురం పట్టణం రుస్తుంబాదుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్, చిత్రకారుడు కొప్పినీడి విజయ్ మోహన్ పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చిత్రం రూపంలో చాటుకున్నాడు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గన్నవరంలో మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వాటర్ కలర్స్ ఉపయోగించి చిత్రాన్ని గీశాడు. అందులో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అని ప్రత్యేకంగా రాశారు. దీంతో విజయ్ మోహన్ను పలువురు అభినందిం చారు.
Similar News
News March 24, 2025
పెరవల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

తూర్పుగోదావరి జిల్లాలోని జాతీయ రహదారి పై పెరవలి మండలం అన్నవరపాడు సెంటర్లో సోమవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ప్రమాద ఘటనలో పిట్టల వేమవరం గ్రామానికి చెందిన మాకా సురేశ్ మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోర్ట్ మార్టమ్ నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 24, 2025
రాజమండ్రి: 27న ఉపసర్పంచ్ పదవులకు ఎన్నికలు

జిల్లాలో వివిధ కారణాలు వల్ల ఖాళీగా ఉన్న 12 ఉపసర్పంచ్ పదవులకు ఈనెల 27న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు డీపీవో శాంతామణి అన్నారు. రాజమండ్రి డివిజన్లో మల్లవరం, పాతతుంగపాడు, లక్ష్మినరసాపురం, మర్రిపూడి, మురమండ, మునికుడలి, కొవ్వూరు డివిజన్లో పెనకనమెట్ట, కొవ్వూరుపాడు, గోపాలపురం, వెంకటాయపాలెం, తాడిపూడి, ఉంద్రాజవరం పంచాయతీల ఉపసర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. EOPR&RD ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు.
News March 24, 2025
రాజమండ్రి: మర్డర్ కేసులో పట్టుబడ్డ నిందితుడు

రాజమండ్రి రూరల్ హుకుంపేట డీ బ్లాక్లో ఆదివారం తల్లీ కుమార్తెలు ఎండీ సల్మాన్, ఎండీ సానియా మర్డర్ కేసులో నిందితుడు పల్లి శివకుమార్ పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా నిందితుడు ముళ్ల కంచెలలో నుంచి పరారవుతున్న సమయంలో కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి వెంబడించారు. నిందితుడి నుంచి ప్రతిఘటన ఎదురవడంతో ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. విధి నిర్వహణలో ధైర్యసాహసాలతో ఎస్సై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.