News November 11, 2024
తూ.గో: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ వివరాలను ఆమె వారికి తెలిపారు. డిసెంబర్ 5న పోలింగ్ జరుగుతుందన్నారు.
Similar News
News October 13, 2025
తూ.గో టీడీపీ అధ్యక్ష పదవికి బొడ్డు,యర్రా పేర్లు పరిశీలన..?

రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరిని జిల్లా టీడీపీ అధ్యక్షునిగా నియమిస్తారనే గుసగుస వినిపిస్తోంది. జిల్లాలో కాపు సామాజిక వర్గ ప్రాబల్యం అధికంగా ఉండడంతో ఆ వర్గానికి ఇస్తే బాగుంటుందని ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. మరో వైపు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సోదరుడి బావమరిది యర్రా వేణు గోపాల్ రాయుడు పేరు తెరపైకి వచ్చింది. ఇద్దరిలో పదవి ఎవరిని వరిస్తుందనేది వేచి చూడాలి.
News October 13, 2025
తూ.గో టీడీపీ అధ్యక్ష పదవి ఏ సామాజిక వర్గానికి దక్కేనో..?

తూ.గో టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కేఎస్ జవహర్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టడంతో ఆ పదవి ఖాళీ అయింది. ఎస్సీ వర్గానికి చెందిన జవహర్ ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. వైసీపీ, బీజేపీ బీసీలకు, జనసేన కాపు వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్న ఇస్తున్నాయని ప్రచారం సాగుతోంది. ఖాళీ అయిన టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఏ సామాజిక వర్గానికి దక్కుతుందనేది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది.
News October 12, 2025
కొవ్వూరు జనసేన సారథి ఎవరు..?

కొవ్వూరు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి గత మూడు నెలలుగా ఖాళీగా ఉంది. సొసైటీ పదవుల నియామకంలో అన్యాయం జరిగిందని ఆందోళనకు దిగిన నాటి ఇన్ఛార్జ్ టీవీ రామారావును జులై 10న అధిష్ఠానం బాధ్యతల నుంచి తప్పించింది. అప్పటినుండి ఈ పోస్టు భర్తీ కాలేదు. దీంతో నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు మందగించాయని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. తక్షణమే ఇన్ఛార్జ్ను నియమించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.