News April 16, 2025

తూ.గో: ఉమ్మడి జిల్లాలో 202 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 202 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు ప్రభుత్వం మంగళవారం జీవో విడుదల చేసింది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 127 SGT(ప్రాథమిక స్థాయి), 75 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Similar News

News October 20, 2025

సీఎం రేవంత్‌తో కొండా సురేఖ దంపతుల భేటీ

image

TG: సీఎం రేవంత్‌ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెడ్డి వర్గమంతా కలిసి తమపై కుట్ర చేస్తున్నారంటూ సురేఖ కూతురు సుస్మిత ఇటీవల చేసిన <<18019826>>ఆరోపణలు<<>> సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

News October 20, 2025

గుంజేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

ముదిగుబ్బ మండలం గుంజేపల్లి చెరువుకట్ట సమీపాన సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన శేషు, కృష్ణ బైకుపై స్వగ్రామానికి వెళ్తూ జేసీబీని ఢీకొన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న 108 వాహనం అక్కడికి వెళ్లగా.. అప్పటికే వారు మృతి చెందారు. ముదిగుబ్బ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నట్లు సీఐ శివరాముడు తెలిపారు.

News October 20, 2025

తిరుపతి రైల్వే స్టేషన్‌లో నకిలీ టీటీ.!

image

తిరుపతి రైల్వే స్టేషన్‌లో టికెట్ పరిశీలకుడిగా నటిస్తూ టికెట్‌ లేని ప్రయాణికులను మోసంచేసి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని రైల్వే భద్రతాదళం, GRP పోలీసులు సంయుక్తంగా కలిసి పట్టుకున్నారు. రైల్వే సిబ్బంది గేట్ నంబర్ 3 వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వాగ్వాదం చేసుకోవడం గమనించారు. చెకింగ్ ఇన్స్పెక్టర్ అనిచెప్పి రూ.1000 అడుగుతుండగా నకిలీ వ్యక్తిని వారు పట్టుకున్నారు.