News February 3, 2025
తూ.గో: ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ

నేడు 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్డ్ వెలువడనుంది. అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు నామినేషన్లను 10 తేదీ వరకు ఉదయం 10.గంటల నుంచి మధ్యాహ్నం 3.గంటల వరకు స్వీకరిస్తారు. ఈ నెల 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ అనంతరం 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. మార్చి 8 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
Similar News
News November 17, 2025
చిన్న అరుణాచలం ఆలయంలో అపశ్రుతి

దుమ్ముగూడెం మండలంలోని నరసాపురం గ్రామం చిన్న అరుణాచలం ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. భక్తులు దీపాలు వెలిగించిన అనంతరం ఆర్పే క్రమంలో నీళ్లనుకొని పక్కనే ఉన్న కార్పెంటైల్ను పోయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మహిళా భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
News November 17, 2025
స్వర్ణ పంచాయతీల్లో 100% పన్ను వసూలు చేయాలి: కలెక్టర్

స్వర్ణ పంచాయతీలకు సంబంధించి 100% పన్ను వసూలు చేయాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. సోమవారం పీజీఆర్ఎస్ సందర్భంగా వివిధ అంశాలపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఆవాస్ ప్లస్ గ్రామిన్ యోజన-2024 సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాలంటే ఈ సర్వేను తప్పకుండా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
News November 17, 2025
పక్కా ప్లాన్తో మర్డర్.. కుప్పంలో దృశ్యం-3

దృశ్యం సినిమాను తలపించేలా కుప్పంలో శ్రీనాథ్ను పక్కా ప్లాన్తో <<18306471>>హత్య <<>>చేశారు. గత నెల 16, 18, 27వ తేదీల్లో శ్రీనాథ్ కుప్పం వచ్చాడు. ‘నీకు డబ్బులు ఇస్తా. కానీ కుప్పం వచ్చేటప్పుడు సెల్ ఫోన్ ఇంట్లోనే పెట్టాలి. కుప్పం రైల్వేస్టేషన్లో దిగగానే ఎవరు గుర్తుపట్టని విధంగా తలకు టోపీ, మాస్క్ వేసుకో. సీసీ కెమెరాల కంట పడకుండా రావాలి’ అని ప్రభాకర్ చెప్పాడు. అలాగే చేయడంతో శ్రీనాథ్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు.


