News March 3, 2025

తూ.గో: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్

image

ఏలూరు సర్‌సీఆర్ రెడ్డి కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. విధులకు హాజరయ్యే సిబ్బందితో కాలేజీ రోడ్ అంతా సందడిగా నెలకొంది. లెక్కింపు ప్రక్రియకు 700 మంది సిబ్బందితో 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప శివ కిశోర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు.

Similar News

News September 15, 2025

తిరుపతిలో డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తా: SP

image

శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఎస్పీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంచడమే పోలీసుల ధ్యేయమని, 24 గంటల పాటు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ‘డ్రగ్స్ ఫ్రీ తిరుపతి’ తన లక్ష్యం అన్నారు.

News September 15, 2025

ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు.?

image

రాబోయే 4 రోజులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద ఉండవద్దని హెచ్చరించారు. ఆదివారం గుంటూరులో 81 మి.మీ. వర్షపాతం నమోదైంది. సోమవారం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

News September 15, 2025

ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, సిద్దిపేటలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇతర చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. నిన్న రాత్రి హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం దంచి కొట్టిన సంగతి తెలిసిందే.