News July 11, 2024

తూ.గో: ఏడుగురి మృతికి కారణం.. జైలు పాలు

image

తూ.గో జిల్లాకు చెందిన ఏడుగురి మృతికి కారణమైన షేక్ మహబూబ్ జానీ అనే వ్యక్తికి యావజ్జీన కారాగార శిక్ష పడింది. వీరవల్లి ఏఎస్సై వివరాల మేరకు..2014లో ప్రమాదకర రసాయనాలు ఉన్న డ్రమ్ములను హైదరాబాద్ నుంచి తణుకుకు బయలుదేరాడు. దారి మధ్యలో తూ.గో జిల్లా వాసులు ఏడుగురిని వ్యానులో ఎక్కించుకున్నాడు. రసాయనాల నుంచి మంటలు వ్యాపించడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు . దీనిపై బుధవారం నూజివీడు న్యాయస్థానం తీర్పు చెప్పింది.

Similar News

News November 27, 2025

తూ.గో.లో మండపేట విలీనం.. పెరగనున్న పట్టణ జనాభా

image

జిల్లాల పునర్విభజనలో భాగంగా తూ.గో జిల్లా పట్టణ జనాభా పెరగనుంది. మండపేట నియోజకవర్గాన్ని జిల్లాలో పూర్తిగా కలుపుతూ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో మండపేట మున్సిపాలిటీ జిల్లా పరిధిలోకి చేరనుంది. ప్రస్తుతం రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు పట్టణాలతో కలిపి 4,27,380 ఉన్న జిల్లా పట్టణ జనాభా.. మండపేట చేరికతో 4,80,968కి చేరనుంది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News November 27, 2025

స్మార్ట్ రేషన్ కార్డులు వెంటనే తీసుకోవాలి: జేసీ

image

నవంబరు నెలాఖరులోగా లబ్ధిదారులు తమ స్మార్ట్ రేషన్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ బుధవారం తెలిపారు. జిల్లాకు మొత్తం 5,59,348 స్మార్ట్ రైస్ కార్డులను ముద్రించి పంపిణీకి పంపినట్లు ఆయన వెల్లడించారు. ఆగస్టు 25 నుంచి సచివాలయ సిబ్బంది, రేషన్ షాపు డీలర్ల ద్వారా ఈ పంపిణీ ప్రారంభమైందని ఆయన వివరించారు.

News November 27, 2025

స్మార్ట్ రేషన్ కార్డులు వెంటనే తీసుకోవాలి: జేసీ

image

నవంబరు నెలాఖరులోగా లబ్ధిదారులు తమ స్మార్ట్ రేషన్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ బుధవారం తెలిపారు. జిల్లాకు మొత్తం 5,59,348 స్మార్ట్ రైస్ కార్డులను ముద్రించి పంపిణీకి పంపినట్లు ఆయన వెల్లడించారు. ఆగస్టు 25 నుంచి సచివాలయ సిబ్బంది, రేషన్ షాపు డీలర్ల ద్వారా ఈ పంపిణీ ప్రారంభమైందని ఆయన వివరించారు.