News April 10, 2024

తూ.గో: ఒక్క తునిలోనే 174 మంది మృతి

image

తూ.గో జిల్లాలో ప్రభుత్వ రైల్వే పోలీస్ శాఖ రైలు ప్రమాదాల్లో మృతుల నివేదికను వెలువరించింది. ఒక్క తుని స్టేషన్‌లోనే 2022 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 5వ వరకు 174 మంది మృతి చెందారు. అనకాపల్లి జిల్లా కశింకోట- పిఠాపురం వరకు మృతి చెందిన వారిలో 49 మంది ఎవరో కూడా తెలియకుండానే ఖననం చేశారు. ఇక మీద ప్రమాదాలు జరగకుండా రైళ్లు, ఫ్లాట్ ఫామ్‌లపై అవగాహన కల్పిస్తున్నామని తుని జీఆర్పీ ఎస్సై అబ్దుల్ మారూఫ్ తెలిపారు.

Similar News

News December 21, 2025

రాజమండ్రిలో కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

వీకెండ్ వచ్చిందంటే మాంస ప్రియులకు పండుగే. రాజమహేంద్రవరం మార్కెట్లో కేజీ స్కిన్ లెస్ ధర రూ.260, స్కిన్ తో కేజీ చికెన్ ధర రూ.240కు అమ్మకాలు జరుగుతున్నాయి. లైవ్ కోడి రూ.135-150కి లభ్యమవుతోంది. ఇదిలా ఉండగా కేజీ మటన్ ధర రూ.900 నుంచి వెయ్యి రూపాయల వరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఆయా ఏరియాల బట్టి మార్కెట్లో చికెన్, మటన్ రేట్లు స్వల్ప తేడాలు ఉన్నాయి. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News December 21, 2025

లోకేశ్ పర్యటన అంతా ఆర్భాటమే: మార్గాని

image

మంత్రి లోకేశ్ రాజమండ్రి పర్యటన కేవలం ఆర్భాటం తప్ప మరేమీ లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ శనివారం విమర్శించారు. పర్యటన సాగిన ప్రతిచోటా వైసీపీ మార్క్ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆసుపత్రిలో బాలింత మృతి, బాలికపై అత్యాచారం వంటి దారుణ ఘటనలపై మంత్రి స్పందించకపోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాంతిభద్రతల వైఫల్యాన్ని వదిలి లోకేశ్ ప్రచారానికే ప్రాధాన్యమిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

News December 21, 2025

లోకేశ్ పర్యటన అంతా ఆర్భాటమే: మార్గాని

image

మంత్రి లోకేశ్ రాజమండ్రి పర్యటన కేవలం ఆర్భాటం తప్ప మరేమీ లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ శనివారం విమర్శించారు. పర్యటన సాగిన ప్రతిచోటా వైసీపీ మార్క్ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆసుపత్రిలో బాలింత మృతి, బాలికపై అత్యాచారం వంటి దారుణ ఘటనలపై మంత్రి స్పందించకపోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాంతిభద్రతల వైఫల్యాన్ని వదిలి లోకేశ్ ప్రచారానికే ప్రాధాన్యమిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.