News June 25, 2024

తూ.గో: కాలువల అభివృద్ధికి రూ.20.76 కోట్లు

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట కాలువలు, మురుగు కాలువలు, గుర్రపు డెక్క తొలగింపునకు ఆమోదం లభించిందని గోదావరి డెల్టా చీఫ్ ఇంజినీర్ సతీశ్ కుమార్ సోమవారం తెలిపారు. మొత్తం 306 పనులకు రూ.20.76 కోట్లు మంజూరు చేశారన్నారు. రూ. 31.50 కోట్లతో 430 పనులు చేసేందుకు ప్రతిపాదనలు పంపించగా.. తొలి ప్రాధాన్యతగా 306 పనులకు నిధులు కేటాయించారని తెలిపారు. మిగిలిన పనులకు త్వరలో నిధులు మంజూరు అవుతాయన్నారు.

Similar News

News November 17, 2025

ధాన్యం కొనుగోలు డబ్బులు 48 గంటల్లో జమ: జేసీ

image

ధాన్యం విక్రయించిన 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో మద్దతు ధర నేరుగా జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జేసీ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 3,240 మంది రైతులకు రూ.55.82 కోట్లు జమ చేసినట్లు సోమవారం రాజమండ్రిలో ఆయన వివరించారు. రైతులకు ఏ సమస్య ఎదురైనా వెంటనే 8309487151 నంబర్‌కు కాల్ చేసి తమ సందేహాలు, ఫిర్యాదులను తెలియజేయవచ్చని సూచించారు.

News November 17, 2025

ధాన్యం కొనుగోలు డబ్బులు 48 గంటల్లో జమ: జేసీ

image

ధాన్యం విక్రయించిన 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో మద్దతు ధర నేరుగా జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జేసీ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 3,240 మంది రైతులకు రూ.55.82 కోట్లు జమ చేసినట్లు సోమవారం రాజమండ్రిలో ఆయన వివరించారు. రైతులకు ఏ సమస్య ఎదురైనా వెంటనే 8309487151 నంబర్‌కు కాల్ చేసి తమ సందేహాలు, ఫిర్యాదులను తెలియజేయవచ్చని సూచించారు.

News November 17, 2025

రాజమండ్రి: శబరిమలైకు ప్రత్యేక బస్సులు

image

శబరిమల భక్తుల నుంచి ఆర్టీసీ బస్సులకు అమితమైన ఆదరణ లభిస్తోంది. ఇందులో భాగంగా రాజమండ్రి డిపో నుంచి సోమవారం ఐదు సూపర్ లగ్జరీ బస్సులు శబరిమల యాత్రకు బయలుదేరాయి. ఈ బస్సులు యాత్ర ముగించుకుని ఈ నెల 23న తిరిగి డిపోకు చేరుకుంటాయి. భక్తుల ఆదరణకు డిపో మేనేజర్ మాధవ్ కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు కోరితే వారి గ్రామాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడపడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.