News May 18, 2024

తూ.గో: కోడిగుడ్డు ధర పెరిగింది

image

కోడిగుడ్డు ధర పెరిగింది. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్లో రూ.7కు విక్రయం జరుగుతోంది. ప్రస్తుతం ధర పెరిగినప్పటికీ రైతుల నుంచి రూ.5కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 300 పౌల్ట్రీలు ఉన్నాయి. దాదాపు 1.40 కోట్ల కోళ్ల పెంపకం జరుగుతుంది. రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. కోడిగుడ్డుకు నికరంగా రూ.6 చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు.

Similar News

News December 7, 2025

తూ.గో: గగనతలంలో ‘తూర్పు’ ఆశలు!

image

నేడు ‘అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం’. ఈ నేపథ్యంలో తూ.గో. వాసుల ఆకాంక్షలు బలంగా వినిపిస్తున్నాయి. మధురపూడి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించాలన్నది ప్రజల చిరకాల స్వప్నం. కడియం పూల గుబాళింపులు విదేశాలకు చేరేలా ‘కార్గో’ సేవలు విస్తరించాలని, గోదావరిపై సీప్లేన్ పర్యాటకం కొత్త పుంతలు తొక్కాలని కోరుతున్నారు. వాణిజ్య, పర్యాటక అభివృద్ధికి విమానయాన రంగం ఊతమివ్వాలని ఆశిస్తున్నారు.

News December 7, 2025

రాజమండ్రి విద్యార్థి సూపర్ టాలెంట్

image

రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్‌లోని శ్రీనివాస రామానుజం మున్సిపల్ హైస్కూల్‌కు చెందిన ఎం.సంజయ్ కుమార్ (10వ తరగతి) యోగా అండర్-17 బాలుర విభాగంలో ప్రతిభ చూపాడు. బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విన్నర్‌గా నిలిచిన సంజయ్, జనవరిలో త్రిపురలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం పీకే ఎన్ సత్యవతి తెలిపారు. పీఈటీ డి. విజయ్ విక్టర్, ఉపాధ్యాయులు సంజయ్‌ని అభినందించారు.

News December 7, 2025

రాజమండ్రి విద్యార్థి సూపర్ టాలెంట్

image

రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్‌లోని శ్రీనివాస రామానుజం మున్సిపల్ హైస్కూల్‌కు చెందిన ఎం.సంజయ్ కుమార్ (10వ తరగతి) యోగా అండర్-17 బాలుర విభాగంలో ప్రతిభ చూపాడు. బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విన్నర్‌గా నిలిచిన సంజయ్, జనవరిలో త్రిపురలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం పీకే ఎన్ సత్యవతి తెలిపారు. పీఈటీ డి. విజయ్ విక్టర్, ఉపాధ్యాయులు సంజయ్‌ని అభినందించారు.