News July 31, 2024
తూ.గో.: జగన్ను కలిసిన MLC, మాజీ MLA

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ను MLC ఉదయ భాస్కర్, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి తాడేపల్లిలో బుధవారం కలిశారు. చింతూరు డివిజన్లో వరద బాధితులను గురించి జగన్ ఆరా తీసినట్లు ఎమ్మెల్సీ మీడియాకు తెలిపారు. ఆపద సమయంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు వరద బాధితులకు అండగా ఉండాలని సూచించారని చెప్పారు.
Similar News
News December 3, 2025
తూ.గో: వైసీపీ నేత కారు దగ్ధం.. ఎస్పీకి ఫిర్యాదు

రాజమండ్రి రూరల్ మండలం వెంకటనగరంలో వైసీపీ నాయకుడు మోత రమేశ్ కారును మంగళవారం అర్ధరాత్రి దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. దీనిపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు.. ఎస్పీ నరసింహ కిషోర్తో ఫోన్లో మాట్లాడారు. ఘటనపై తక్షణమే విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితునికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.
News December 3, 2025
CM చంద్రబాబు నల్లజర్ల షెడ్యూల్ ఇదే.!

సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం 11:20కి నల్లజర్ల చేరుకుంటారని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. 11:20–11:40 AM రైతన్నా–మీ కోసం స్టాళ్ల పరిశీలన, 11:45AM వేదిక వద్దకు చేరుకుంటారు. కలెక్టర్ స్వాగత ప్రసంగం. 11:50 AM–12:15 PM రైతులతో సీఎం పరస్పర చర్చ ఉంటుందన్నారు. 12:15–12:20 PMఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రసంగం, రైతులకు సన్మానం, 1.15 గంటలకు పార్టీ కేడర్తో సమావేశం అవుతారన్నారు.
News December 3, 2025
ఏపీలో ఫిలిం టూరిజానికి మాస్టర్ ప్లాన్: మంత్రి దుర్గేష్

ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ టూరిజానికి ప్రోత్సాహం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ప్రకటించారు. ఏపీని దేశంలోనే సినిమా షూటింగ్లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తామన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. విశాఖ బీచ్లు, గోదావరి నదీ తీరాలు, అరకు, లంబసింగి, తిరుపతి, శ్రీశైలం వంటి ప్రదేశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.


