News May 25, 2024
తూ.గో జిల్లాకు జూన్ 7లోగా రుతుపవనాల ఎంట్రీ

వచ్చేనెల మొదటివారంలోనే ఉమ్మడి తూ.గో జిల్లాకు రుతుపవనాలు రానున్నాయి. ఈనెల 29 నుంచి 30 లోగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని అంచనా వేస్తున్నారు. ఇవి నాలుగు లేదా ఐదవ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీరానికి చేరుతాయి. అప్పట్నుంచి భారీగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జిల్లా సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఈ సారి 105 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.
Similar News
News December 6, 2025
8న పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

డిసెంబర్ 8న రాజమండ్రి కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల, గ్రామ సచివాలయ స్థాయిల్లో PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ వేదిక ద్వారా ప్రజల అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ప్రధాన లక్ష్యమన్నారు. అర్జీదారులు తమ వినతిపత్రాలను Meekosam.ap.gov.in ద్వారా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చని ఆమె చెప్పారు.
News December 6, 2025
హోంగార్డుల సేవలు కీలకం: ఎస్పీ

63వ హోంగార్డ్స్ ఆవిర్భావ వేడుకలను శనివారం రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోంగార్డులు నిస్వార్థ సేవలు అందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సేవా దృక్పథంతో విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ కొనియాడారు. పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు కీలకమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
News December 6, 2025
తూ.గో. జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతం: జేసీ

తూ.గో. జిల్లాలో ఖరీఫ్ 2025-26 ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతోందని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 35,391 మంది రైతుల నుంచి 2,63,423.160 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మొత్తం విలువ రూ. 601.79 కోట్లు కాగా, ఇందులో ఇప్పటికే రూ. 540.08 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు.


