News May 24, 2024
తూ.గో జిల్లాలో తొలి ఫలితం కొవ్వూరుదే

తూ.గో జిల్లాలో ఓట్ల లెక్కింపు నాడు కొవ్వూరు నియోజకవర్గ ఫలితం మొదట వెలువడనుంది. జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 116 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కొవ్వూరు-13 రౌండ్లు, నిడదవోలు-15, రాజానగరం-16, అనపర్తి-17, రాజమండ్రి సిటీ-17, రాజమండ్రి రూరల్-20, గోపాలపురం-18 రౌండ్లలో ముగియనుంది. ఒక్కో నియోజకవర్గానికి 14చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. మొత్తం 1577 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది.
Similar News
News February 13, 2025
చాగల్లు: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

చాగల్లు మండలం చిక్కాల గ్రామానికి చెందిన దుర్గాభవాని(35), వివాహిత కుమార్తె కుమారుడు సంతానం ఇటీవల ఆర్థిక ఇబ్బందులు కారణంగా మనస్థాపానికి గురై గురువారం ఆమె పిల్లలతో మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకోంది. చికిత్స నిమిత్తం వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మరణించింది. పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్సై నరేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 13, 2025
తూ.గో జిల్లా మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్ల రాకపోకలు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 14,16,21,23 తేదీలలో జిల్లా మీదుగా పలు రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 14, 21 తేదీలలో చర్లపల్లి – కాకినాడ టౌన్(070310),16,23 తేదీలలో కాకినాడ టౌన్ చర్లపల్లి(07032) రైళ్లు నడవనున్నాయని తెలిపారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
News February 13, 2025
తూ.గో: నాటుకోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్

బర్డ్ ఫ్లూ అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. కోళ్ల రైతులు, పెంపకందారులు బెంబేలెత్తిపోతున్నారు. బర్డ్ ఫ్లూ నాటుకోళ్లపై కూడా తాజాగా ప్రభావం చూపుతోంది. బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా కానూరు అగ్రహారంలో కోళ్ల ఫారాల్లో కోళ్లన్నీ చనిపోయాయి. వైరస్ కానూర్ అగ్రహారంలో నాటుకోళ్లకూ సోకింది. అక్కడ వ్యాధి సోకిన నాటుకోళ్లను పూడ్చివేశారు. దాదాపు 500 నాటుకోళ్లు చనిపోయాయి.